ఐబీఎంతో ఏపీ స‌ర్కార్ కీల‌క ఒప్పందం

Spread the love

ల‌క్ష మంది ప్ర‌తిభావంతుల‌కు శిక్ష‌ణ

న్యూఢిల్లీ : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు శుక్ర‌వారం న్యూఢిల్లీలో జ‌రుగుతున్న ఏఐ ఇంపాక్ట్ స‌ద‌స్సులో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. మారుతున్న టెక్నాల‌జీకి అనుగుణంగా ఏపీకి చెందిన ప్ర‌తిభావంతులైన వారికి కీల‌క అంశాల‌పై శిక్ష‌ణ ఇచ్చేలా చూడాల‌ని కోరారు. చంద్ర‌బాబు నాయుడు చేసిన సూచ‌న‌ల‌కు సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 1 లక్ష మంది ప్రతిభావంతులైన యువతకు ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటం కంప్యూటింగ్‌లో నైపుణ్యం కల్పించడానికి తాము IBMతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామ‌ని ప్ర‌క‌టించారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

రాబోయే 3 నుండి 5 సంవత్సరాలలో త‌మ అభ్యాసకులు పరిశ్రమకు అనుగుణంగా, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నైపుణ్యాలను పొందుతారని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక శ్రామిక శక్తిని బలోపేతం చేస్తారని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో IBM EMEA , గ్రోత్ మార్కెట్స్ SVP , , చైర్ అనా పౌలా, IBM ఇండియా, దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్, IBM రీసెర్చ్ ఇండియా., CTO డైరెక్టర్ డాక్టర్ అమిత్ సింఘీ , ప్రభుత్వం , నియంత్రణ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిషోర్ బాలాజీతో ఈరోజు ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ సంతకం చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు సీఎం.

  • Related Posts

    జ‌గ‌న్ డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలు న‌డ‌వ‌వు

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత హైద‌రాబాద్ : రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడారు. అసెంబ్లీ, శాస‌న మండ‌లి…

    ఆంటోనియో గుటెర్రెస్ తో పీఎం భేటీ

    Spread the love

    Spread the loveప్ర‌పంచాన్ని శాసిస్తున్న ఏఐ పై చ‌ర్చ న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో శుక్ర‌వారం చ‌ర్చ‌లు జ‌రిపారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఢిల్లీలో ఇండియా ఇంపాక్ట్ ఏఐ స‌మ్మిట్ 2026లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఇరువురి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *