
భూపేన హజారికా శత జయంతి వేడుకలు
అస్సాం : అస్సాం రాష్ట్ర భూమి పుత్రుడు, దేశ వ్యాప్తంగా పేరు పొందిన గాయకుడు భూపేన్ హజారికా శత జయంతి ఉత్సవాలకు సిద్దం అవుతోంది ఆ రాష్ట్రం. ఈ మేరకు ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. సెప్టెంబర్ 14న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానుండడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అస్సాంకు చెందిన భూపేన్ హజారికా ప్రముఖ గాయకుడు, గేయ రచయిత మాత్రమే కాకుండా కవి, చిత్రనిర్మాత , సాంస్కృతిక రాయబారిగా గుర్తింపు పొందారు. డాక్టర్ హజారికాకు నివాళులు అర్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ‘బ్రహ్మపుత్ర బార్డ్’ అని పిలువబడే డాక్టర్ హజారికా కూర్పులు అస్సామీ జానపద సంప్రదాయాలలో పాతుకు పోయిన లోతైన మానవతావాదాన్ని కలిగి ఉన్నాయి. అదే సమయంలో విశ్వవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.
ప్రేమ, మానవత్వం, సోదరభావం, సామాజిక న్యాయం గురించి ఆయన పాటలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పొందాయి. భారతరత్న డాక్టర్ భూపేన్ హజారికా శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించే పనిలో పడింది సర్కార్. గోలాఘాట్ జిల్లాలోని నుమాలిఘర్ రిఫైనరీ లిమిటెడ్ లో బయో-రిఫైనరీ ప్రాజెక్టును ప్రారంభించడంతో పాటు, డాక్టర్ భూపెన్ హజారికా , ఆయన చేసిన కృషికి నివాళులు అర్పించడానికి ఒక ప్రజా ర్యాలీలో ప్రసంగిస్తారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారం సోషల్ మీడియా ద్వారా మాస్ట్రో జీవితం, వారసత్వాన్ని గుర్తు చేసుకున్నారు, ఆయన రచనలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. గౌహతిలోని ఆయన స్మారక స్థలంలో ఒక స్మారక కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తున్నారు.
భూపేన్ హజారికా సెప్టెంబర్ 8, 1926న అస్సాంలోని సాదియాలో జన్మించారు. తన విలక్షణమైన స్వరం , హృదయ విదారకమైన సాహిత్యంతో భారతదేశ సాంస్కృతిక చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన రచనలు ప్రాంతీయ సరిహద్దులను అధిగమించాయి, బెంగాల్లో, భారతదేశం అంతటా మరియు బంగ్లాదేశ్లో కూడా ఆయనకు గుర్తింపు లభించింది.