నాకు ప్ర‌తిప‌క్ష హోదా ఎందుకు ఇవ్వ‌లేదు..?

కూట‌మి స‌ర్కార్ ను ప్ర‌శ్నించిన జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఏపీ స‌ర్కార్ ను ఏకి పారేశారు. త‌న‌కు ప్ర‌తిపక్ష హోదా ఎందుకు ఇవ్వ‌డం లేదో చెప్పాల్సిన బాధ్య‌త సీఎం చంద్ర‌బాబు నాయుడుపై ఉంద‌న్నారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్న‌ది ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. బుధ‌వారం జ‌గ‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వట్లేదో ముందు సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్ని రోజులు అసెంబ్లీకి వచ్చాడో తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

సభలో ఏమీ జరగక పోయినా ఒక డ్రామా క్రియేట్ చేశాడ‌ని, ఆ త‌ర్వాత చాలా తెలివిగా ఏడ్పు రాక పోయినా ఏదో జ‌రిగి పోయిన‌ట్లు, కొంప‌లు కూలి పోయిన‌ట్లు తెగ న‌టించాడ‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న చేసిన న‌ట‌న‌ను చూసి ప్ర‌తి ఒక్క‌రు విస్తు పోయార‌న్నారు. సినిమాల‌లో న‌టించే న‌టులు సైతం ఆశ్చ‌ర్య పోయేలా ఏడ్చాడ‌ని, దీంతో అంద‌రూ త‌న‌కు ఏదో అయి పోతోంద‌ని విస్మ‌యానికి లోన‌య్యార‌ని చెప్పారు జ‌గ‌న్ రెడ్డి. తాను గన‌క శాస‌న స‌భ‌లో ఉంటే అసెంబ్లీకి రానంటూ వెళ్లి పోయాడ‌ని, ఆ త‌ర్వాత ప‌త్తా లేకుండా పోయాడ‌ని ఇప్పుడు త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు మాజీ సీఎం. అసెంబ్లీ రికార్డులు మొత్తం తిరగేశాన‌ని, కానీ ఎక్క‌డా మావాళ్లుతప్పు మాట్లాడలేద‌ని, ఆ విష‌యం తేలి పోయింద‌న్నారు.

  • Related Posts

    ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్

    ప్ర‌క‌టించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ టాప్ లో ఉంద‌న్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ…

    రైతుల‌ను బ‌లోపేతం చేయ‌డంలో నాబార్డ్ కృషి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఈ దేశానికి వెన్నెముక‌గా రైతులు ఉన్నార‌ని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. రైతుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటూ వారిని మ‌రింత అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *