
వీఐపీ ఏపీ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్
అమరావతి : రాబోయే రోజుల్లో సెడీ కండక్టర్ రంగం కీలకంగా మారబోతోందని, ఇప్పటికే తన ప్రభావాన్ని చూపిస్తోందని చెప్పారు వీఐటీ, ఏపీ యూనివర్శిటీ వైస్ ఛాన్స్ లర్ ఎస్ వీ కోటా రెడ్డి . ఏపీ వేదికగా జరుగుతున్న వీఐటీ, ఏపీ యూనివర్శిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెమీ కండక్టర్ సింపోజియం కాన్ఫరెన్స్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సెమీ కండక్టర్ రంగంలో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సదస్సు ను మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామని ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన దిగ్గజ కంపెనీలు, అధిపతులతో పాటు సాంకేతిక నైపుణ్యం కలిగిన వారు కూడా హాజరయ్యారని తెలిపారు.
సెమీకండక్టర్ టెక్నాలజీ, అప్లికేషన్ డొమైన్ల నుండి నిపుణుల అద్భుతమైన సంఘాన్ని ఒకచోట చేర్చిందన్నారు. నిజంగా ఈ ప్రాంత సాంకేతిక పర్యావరణ వ్యవస్థకు గర్వ కారణమైన క్షణమని పేర్కొన్నారు. ఇన్వెంటిజ్ సీఈఓ, ఐటాప్ చైర్మన్ అన్నే ఇంద్రజిత్ మాట్లాడుతూ భారతదేశ సాంకేతిక, పారిశ్రామిక వృద్ధికి కీలకమైన రంగం, సెమీకండక్టర్ టెక్నాలజీలోని తాజా ధోరణులు, ఆవిష్కరణలు , సవాళ్లపై చర్చించడానికి దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు , విద్యార్థులను ఒకచోట చేర్చడం ఈ జాతీయ స్థాయి కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు.
ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ సెమీ కండక్టర్ తయారీ అమరావతిలో ఒక స్థలాన్ని కనుగొంటే, అది మన ప్రాంతాన్ని ప్రపంచ సాంకేతిక పటంలో ఉంచడమే కాకుండా డిజైన్, ఫ్యాబ్రికేషన్, టెస్టింగ్, అనుబంధ సేవలలో వేలాది అధిక-నాణ్యత ఉద్యోగాలను కల్పిస్తుందని అన్నారు.