అప్పలాయగుంటలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట

శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో

తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలలో భాగంగా బుధవారం శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్టను నిర్వహించారు. ఉదయం యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన చేపట్టారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాల అనంతరం స్నపన తిరుమంజనం చేపట్టారు.

సాయంత్రం శ్రీవారిని తిరుచ్చి పైకి వేంచేపు చేసి సమర్పణ చేపట్టారు. అనంతరం తిరువీధి ఉత్సవం నిర్వహించారు. రాత్రి యాగశాలలో పలు వైదిక కార్యక్రమాల అనంతరం పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.

18వ తేదీ గురువారం స్వామి వారికి పవిత్ర సమర్పణ చేపడుతారు. సాయంత్రం తిరువీధి ఉత్సవం చేపడుతారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

19వ తేదీ గురువారం ఉదయం ఏకాంతంగా శ్రీవారికి, శ్రీ పద్మావతీ అమ్మ వారికి, శ్రీ ఆండాళ్ అమ్మ వారికి అభిషేకం చేస్తారు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాల తర్వాత స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు. సాయంత్రం శ్రీవారి తిరువీధి ఉత్సవం, రాత్రికి పలు వైదిక కార్యక్రమాల అనంతరం పూర్ణాహుతి, కుంభబింభం వేంచేపు, కళవాహన విశేష నివేదన, అర్చక బహుమానంతో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంధ్రనాథ్, సూపరింటెండెంట్ లు, ఆలయ ఇస్పెక్టర్లు, అర్చకుల, భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప‌ద్మావ‌తి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి

    భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు.…

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *