సంయుక్త క‌మిటీలు కీల‌క పాత్ర పోషిస్తాయి

స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు, మోష‌న్ రాజు

అమ‌రావ‌తి : ప్ర‌భుత్వం నియ‌మించిన ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీలు కీల‌క పాత్ర పోషిస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ శాస‌న స‌భ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు, శాస‌న మండ‌లి చైర్ ప‌ర్స‌న్ కొయ్యే మోష‌ణ్ రాజు . శ‌నివారం అసెంబ్లీ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో చైర్మ‌న్లు కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఈ కమిటీలు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు జిల్లాలలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని చర్చించి పరిష్కార మార్గాలను సూచించాలని చెప్పారు. అవసరమైతే ఇతర రాష్ట్రాలలో కూడా పర్యటనలు చేపట్టాలని తెలిపారు. ఈ కమిటీ వ్యవస్థ అనేది చట్టసభలకు ఒక ఆయువుపట్టు లాంటిదని అన్నారు స్పీక‌ర్.

సభా సమావేశాలు సంవత్సరం పొడవునా జరపటం సాధ్యం కాని పని అన్నారు అయ్య‌న్న పాత్రుడు. ఈ కమిటీలు సభ పని బారాన్ని పంచుకుంటాయని తెలిపారు. సంవత్సరం పొడవునా పని చేస్తాయన్నారు. ఈ కమిటీలన్నీ శాసనసభ , మండలి లోని ప్రాతినిధ్యాన్ని ప్రతిబింబిస్తూ ప్రభుత్వ పాలనను సమీక్షించి ప్రజలకు న్యాయం జరిగేలా చేయడంలో కీలకంగా ఉంటాయని అన్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు వంటి వర్గాల సంక్షేమానికి మనం తీసుకొనే చర్యలు నైతిక బాధ్యత మాత్రమే కాదు రాజ్యాంగబద్ధమైన విధి అని పేర్కొన్నారు. అదేవిధంగా వెనుకబడిన, అసూచిత, మైనారిటీ వర్గాల అభివృద్ధి లో ,వీరి సమస్యలు పరిస్కారించటంలో ఈ కమిటీల ప్రాధాన్యత అపారమైనదని అన్నారు. కమిటీల ఏర్పాటుతో ప్రజల సమస్యలు మరింత సమర్థవంతంగా చర్చించ బడతాయని స్ప‌ష్టం చేశారు. ప్రజాస్వామ్య స్థిరత్వానికి తోడ్పడతాయని స్పీకర్ అన్నారు.

  • Related Posts

    ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోతే ఎలా..?

    ఏపీ స‌ర్కార్ పై భ‌గ్గుమ‌న్న మాజీ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఏపీ స‌ర్కార్ పాల‌న‌ను గాలికి వ‌దిలి వేసింద‌న్నారు. పేదల తలరాతను…

    భ‌క్త క‌న‌క‌దాస‌ను స్పూర్తిగా తీసుకోవాలి

    పిలుపునిచ్చిన మంత్రి ఎస్. స‌విత‌ తిరుప‌తి : సాధువు, యోగి భ‌క్త క‌న‌క‌దాసును స్పూర్తిగా తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు మంత్రి ఎస్. స‌విత‌. తిరుప‌తి ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన భ‌క్త క‌న‌క‌దాసు విగ్ర‌హాన్ని ఆమె ఆవిష్క‌రించారు. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు. రాష్ట్రంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *