టీటీడీ చైర్మ‌న్ ను క‌లిసిన శంక‌ర్ గౌడ్

ఆల‌య అభివృద్ది గురించి ప్ర‌త్యేక చ‌ర్చ

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ (టీటీడీ) బీఆర్ నాయుడును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు తెలంగాణ జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, హిమాయ‌త్ న‌గ‌ర్ టీటీడీ ఎల్ఏసీ చైర్మ‌న్ నేమూరి శంక‌ర్ గౌడ్. టీటీడీ ఆల‌య అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని, పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాని ఈ సంద‌ర్బంగా కోరారు. ఈ మేర‌కు ఆయ‌న‌కు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. రానున్న రోజుల్లో చేపట్టబోయే కీలక చర్యలపై చర్చించారు. ఆలయ విస్తరణ, భక్తుల సౌకర్యాల మెరుగుదల, రాబోయే ధార్మిక కార్యక్రమాలు చేప‌ట్ట‌డం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయని తెలిపారు శంక‌ర్ గౌడ్.

టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడును క‌లిసిన అనంత‌రం శంక‌ర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. తాను ప్ర‌స్తావించిన అన్ని అంశాల గురించి త‌ను సావ‌ధానంగా విన్నార‌ని తెలిపారు. అంతే కాకుండా త్వ‌ర‌లోనే నిధుల మంజూరీకి కూడా హామీ ఇచ్చార‌న్నారు. అంతే కాకుండా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన 100 గదుల నిర్మాణానికి సంబంధించిన అంశం గురించి ప్ర‌త్యేకంగా తాను చైర్మ‌న్ తో ప్ర‌స్తావించాన‌ని చెప్పారు శంక‌ర్ గౌడ్. దీనిపై కూడా టీటీడీ చైర్మ‌న్ చాలా సానుకూలంగా స్పందించార‌ని, ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

  • Related Posts

    ప‌ద్మావ‌తి అమ్మ‌వారి స‌న్నిధిలో రాష్ట్ర‌ప‌తి

    భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా గురువారం భార‌త దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అమ్మ వారి ఆల‌యానికి చేరుకున్నారు.…

    స‌త్య‌సాయి బాబా స్పూర్తి తోనే జ‌ల్ జీవ‌న్ మిష‌న్

    ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల శ్రీ స‌త్య‌సాయి పుట్ట‌ప‌ర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పం. ప్రభుత్వ పరంగా నేడు జల్ జీవన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *