ఏపీలో రీన్యూ కంపెనీ రూ. 60 వేల కోట్ల పెట్టుబ‌డి

సీఎం చంద్రబాబు సమ‌క్షంలో కీల‌క ఒప్పందం

విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ స‌ర్కార్ దూకుడు పెంచింది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు 2025 విశాఖ న‌గ‌రం వేదిక‌గా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గురువారం పెద్ద ఎత్తున కంపెనీల‌తో కీల‌క‌మైన ఒప్పందాల‌ను చేసుకుంది కూట‌మి ప్ర‌భుత్వం. ఈ మేర‌కు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో మంత్రి నారా లోకేష్ , రీ న్యూ కంపెనీ చైర్మ‌న్ , చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ సుమంత్ సిన్హా ఆధ్వ‌ర్యంలో రూ. 60 వేల కోట్ల పెట్టుబ‌డుల కోసం ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా నాలుగు ప్ర‌ధాన ప్రాజెక్టులు చేప‌ట్ట‌నున్నారు.

ఇది మే 2025 లో రీ న్యూ ఇప్పటికే చేసిన ₹22,000 కోట్లపై నిర్మించ బడింది. ఈ పెట్టుబడులలో 6GW సోలార్ ఇంగోట్, వేఫర్ తయారీ సౌకర్యం, 300KTPA గ్రీన్ అమ్మోనియా ప్లాంట్, 2GW పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్ , 5GW పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్లాంట్ ఉన్నాయి. ఈ చొరవలు క్లీన్ ఎనర్జీ పరివర్తనలో ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని ముందుకు తీసుకు వెళతాయి. రాష్ట్ర నైపుణ్యం కలిగిన యువతకు గణనీయమైన అవకాశాలను సృష్టిస్తాయని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇక సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సులో రూ. 10 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు.

  • Related Posts

    తెలంగాణ రాష్ట్రంలోనే స‌న్న బియ్యం

    పంపిణీ చేస్తున్నామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే త‌మ స‌ర్కార్ పేద‌ల‌కు స‌న్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.…

    బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *