డిసెంబ‌ర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్

ఏర్పాట్ల‌పై స‌మీక్ష చేప‌ట్టిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : పెట్టుబ‌డుల‌ను సాధించ‌డంలో ఓ వైపు ఏపీ స‌ర్కార్ టాప్ లో కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే విశాఖ వేదిక‌గా సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సును స‌క్సెస్ ఫుల్ గా నిర్వ‌హించింది. ఇదే స‌మ‌యంలో తెలంగాణ స‌ర్కార్ కూడా సిద్ద‌మైంది స‌మ్మిట్ ను నిర్వహించేందుకు . ఇందులో భాగంగా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ మేర‌కు స‌చివాల‌యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి ఆయా విభాగాల‌కు చెందిన ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్బంగా దిశా నిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ లో నిర్వహించబోయే Telanaga Rising Global Summit- 2025 పై పూర్తిగా దృష్టి సారించాల‌ని ఆదేశించారు. డిసెంబర్ 9 న Telanga Rising-2047 పాలసీ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇది తెలంగాణ భవిష్యత్ కు రోడ్ మ్యాప్ కానుంద‌న్నారు. ఈ డాక్యూమెంట్ దేశ, విదేశీ పెట్టుబడిదారులకు ఒక మార్గదర్శక పత్రంలా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. శాఖల వారీగా పాలసీలకు సంబంధించి సమ్మిట్ లో ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లను సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు సీఎం. ఈ గ్లోబల్ సమ్మిట్ కు వివిధ దేశాల ప్రతినిధులకు ఆహ్వానాలు, ఇతర ఏర్పాట్ల పై సమీక్షలో చర్చించారు.

  • Related Posts

    తెలంగాణ రాష్ట్రంలోనే స‌న్న బియ్యం

    పంపిణీ చేస్తున్నామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే త‌మ స‌ర్కార్ పేద‌ల‌కు స‌న్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.…

    బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *