బీహార్ లో ఎన్నిక‌ల సంఘానికి కంగ్రాట్స్

షాకింగ్ కామెంట్స్ చేసిన ఆదిత్యా ఠాక్రే
ముంబై : బీహార్‌లో ఎన్డీఏ అఖండ విజయంపై శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్క‌డ మ‌రోసారి ఎన్డీయే స‌ర్కార్ విజ‌యం సాధించేలా స‌పోర్ట్ చేసినందుకు, ప్ర‌జాస్వామ్యాన్ని పాత‌ర వేసినందుకు ఎన్నికల సంఘానికి ప్ర‌త్యేకంగా అభినంద‌న‌లు తెలియ చేస్తున్నానంటూ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆదిత్యా ఠాక్రే మీడియాతో మాట్లాడారు. వారి యజమానులైన బిజెపికి 65 లక్షల మంది ఓటర్లను కోసే SIR ప్రయోగం విజయవంతమైందని అన్నారు. బిజెపి ఆట కారణంగా నితీష్ కుమార్ నిజంగా ముఖ్యమంత్రి అవుతాడా అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేమ‌న్నారు.

బిజెపిని దగ్గరగా చూసినందున ఆయన అప్రమత్తంగా ఉండాలని నేను సూచిస్తున్నానని అన్నారు. మహిళల కోసం పథకాలు వారి ఓట్లను ప్రభావితం చేస్తాయని నేను నమ్మను అని చెప్పారు ఆదిత్యా ఠాక్రే. మహిళలు ఎప్పుడూ ఎవరికి ఓటు వేస్తారనే దాని గురించి ఆలోచిస్తారు. వాస్త‌వానికి బీహార్ లో వారు ఓటు వేయలేదు, ‘నోట్లు’ వైపు చూస్తూనే ఉన్నారని అన్నారు. వారు (ఎన్డీఏ) ఓటు-చోరి ద్వారా తమ విజయాన్ని సమర్థించు కోవడానికి ‘లాడ్లీ బెహ్నా’ పథకం సాకును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ మ్యాజిక్ ఎన్నికల సంఘం వల్ల జరిగిందని మండిప‌డ్డారు. భార‌త ఎన్నిక‌ల సంఘం కాద‌ని బీజేపీ ఎన్నిక‌ల సంఘం అని పేర్కొన్నారు.

  • Related Posts

    తెలంగాణ రాష్ట్రంలోనే స‌న్న బియ్యం

    పంపిణీ చేస్తున్నామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే త‌మ స‌ర్కార్ పేద‌ల‌కు స‌న్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.…

    బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *