దేశానికి స్పూర్తి ఇందిర జీవితం : ష‌ర్మిలా రెడ్డి

యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచిన నేత‌

విజ‌య‌వాడ : యావ‌త్ భార‌త జాతికి స్పూర్తి దాయకంగా దివంగ‌త తొలి మ‌హిళా ప్ర‌ధాని ఇందిరాగాంధీ అని అన్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైస్ ష‌ర్మిలా రెడ్డి. ధైర్య సాహసాలకు, భారతీయ మహిళా శక్తికి ప్రతీక, ఉక్కు మహిళ, భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా విజయవాడలోని చల్లపల్లి బంగ్లా వద్ద మహనీయురాలి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. . జమిందారీ వ్యవస్థ రద్దు, బ్యాంకుల జాతీయకరణ, హరిత విప్లవం, భూ సంస్కరణలు, అణుశక్తి అభివృద్ధి, మహిళా సాధికారిత లాంటి ఇందిరా గాంధీ కీలక సంస్కరణలు దేశ అభివృద్ధికి నిదర్శనంగా నిలిచాయ‌ని అన్నారు.

ఆమె ఇవాళ మ‌నంద‌రి మ‌ధ్య భౌతికంగా లేక పోవ‌చ్చు. కానీ ఇందిరా గాంధీ సాధించిన విజ‌య‌వాలు, నాయ‌క‌త్వ నైపుణ్యం, ప్ర‌త్యేకించి దేశం కోసం తాను తీసుకున్న అసాధార‌ణ నిర్ణ‌యాలు ఎల్ల‌ప్ప‌టికీ గుర్తుండి పోతాయ‌న్నారు. సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఇందిర , విజ‌యేందిర బ‌తికే ఉంటుంద‌ని, కోట్లాది గుండెల్లో గూడు కట్టుకుని నిలిచి ఉంటుంద‌న్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. గాంధీ కుటుంబం ఈ దేశం బ‌లై పోయార‌ని, సిక్కుల కాల్పుల్లో త‌ను నేల‌కొరిగార‌ని, నేటికీ ఇందిర అంటేనే ఇండియా అని దానిని కాద‌నే హ‌క్కు ఎవ‌రికీ లేద‌న్నారు .

  • Related Posts

    తెలంగాణ రాష్ట్రంలోనే స‌న్న బియ్యం

    పంపిణీ చేస్తున్నామ‌న్న సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే త‌మ స‌ర్కార్ పేద‌ల‌కు స‌న్న బియ్యం (సోనామసూరి) పంపిణీ చేస్తున్నామ‌ని చెప్పారు.…

    బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు రూ.20.29 కోట్లు మంజూరు చేసినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *