రూ. 1100 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

12.50 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి స్వాధీనం

హైద‌రాబాద్ :హైద‌రాబాద్ లో ప‌లు చోట్ల ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా తొల‌గించింది. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో క‌బ్జాల నుంచి ప్ర‌భుత్వ భూమికి విముక్తి క‌ల్పించింది. 12.50 ఎక‌రాల మేర ప్ర‌భుత్వ భూమిని కాపాడింది. దీని విలువ రూ. 1100ల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. బంజారాహిల్స్ రోడ్డు నంబ‌రు 10లో మొత్తం 5 ఎక‌రాల మేర ఉన్న క‌బ్జాల‌ను తొల‌గించింది. ఇక్క‌డ ఈ భూమి విలువ రూ. 750 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని భావిస్తున్నారు. మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లాలో 7.50 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని స్వాధీనం చేసుకోగా..రంగారెడ్డి జిల్లాలో ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన 680 గ‌జాల స్థ‌లాన్ని హైడ్రా కాపాడింది.

షేక్‌పేట మండ‌లం బంజారాహిల్స్ రోడ్డు నంబ‌రు 10లోని స‌ర్వే నంబ‌రు 403లోని 5 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని క‌బ్జాల చెర నుంచి హైడ్రా విడిపించింది. దీని విలువ రూ. 750 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. లేని స‌ర్వే నంబ‌రు(403/52 )తో.. అన్ రిజిస్ట‌ర్డ్ సేల్‌డీడ్‌ను సృష్టించి ఈ భూమి త‌న‌దంటూ పార్థ‌సారధి అనే వ్య‌క్తి క‌బ్జాకు పాల్ప‌డిన‌ట్టు రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తాగు నీటి వ్య‌వ‌స్థ‌ను మెరుగు ప‌రిచేందుకు ఇందులో 1.20 ఎక‌రాల భూమిని జ‌ల‌మండ‌లికి ప్ర‌భుత్వం ఇచ్చినా అక్క‌డ ప‌నులు చేయ‌కుండా అడ్డు కుంటున్నార‌నేది మ‌రో ఫిర్యాదు. ఈ రెండు ఫిర్యాదుల‌ను హైడ్రా క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి, ప్ర‌భుత్వ భూమిగా నిర్ధారించుకుని ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించింది.

  • Related Posts

    మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్న‌తికి కృషి

    రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ ధ్యేయమని,…

    ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న : సీఎం

    వ్య‌వ‌సాయ రంగానికి అధిక ప్రాధాన్య‌త అమ‌రావ‌తి : ఏపీలో రైతుల వ‌ద్ద‌కే పాల‌న తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలిపారు. అన్న‌దాత సుఖీభ‌వ కింద రెండు విడతల్లో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *