వ‌డ్డెర సామాజిక వ‌ర్గీయుల‌కు అధిక ప్రాధాన్య‌త

Spread the love

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి సవిత. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లోనూ వడ్డెర నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించామన్నారు. వడ్డెరలకు క్వారీ కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్లతో పాటు సీనరేజ్ ఫీజులో 50 శాతం రాయితీ కూడా అందిస్తామన్నారు. వడ్డెరలను ఎస్టీలో చేర్చే అంశం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉందన్నారు. వడ్డెరలను అన్ని విధాలా అభివృద్ధి చెందేలా సీఎం కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి వెల్లడించారు.

వడ్డెరలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలంటే విద్య తప్పనిసరి అని సవిత స్ప‌ష్టం చేశారు. తమ బిడ్డలను ఉన్నత విద్య చదివేలా ప్రోత్సహించాలని సూచించారు. వడ్డెర సామాజిక వర్గీయుల వినతి మేరకు తన తండ్రి పేరు మీద ఉన్న ఎస్ఆర్ఆర్ ట్రస్టు ద్వారా సొంత నిధులతో గోరంట్ల మండల కేంద్రంలో వడ్డె ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు అంజనప్ప, బీజేపీ జిల్లా అధ్యక్షులు శేఖర్ సాహు, టీడీపీ సీనియర్ నాయకులు దేవళ్ల మురళి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో వడ్డెర సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రెండున్న‌ర ఏళ్ల‌యినా హామీల జాడేది..?

    Spread the love

    Spread the loveతెలంగాణ స‌ర్కార్ బ‌క్వాస్ అన్న కేటీఆర్ హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏర్పాటై రెండున్న‌ర ఏళ్లు కావ‌స్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్క‌డ అమ‌లు అయ్యాయో చెప్పాల్సిన బాధ్య‌త సీఎం రేవంత్ రెడ్డిపై ఉంద‌న్నారు మాజీ…

    మోదీ బీజేపీ స‌ర్కార్ బ‌క్వాస్ : ష‌ర్మిలా రెడ్డి

    Spread the love

    Spread the loveపేద‌ల కడుపు కొట్టిన బీజేపీ ప్ర‌భుత్వంఅమ‌రావ‌తి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర స‌ర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీపీసీసీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *