పోలీసుల‌కు అండ‌గా సుధారెడ్డి ఫౌండేష‌న్

Spread the love

స్ప‌ష్టం చేసిన ఎంఈఐఎల్ డైరెక్ట‌ర్

హైద‌రాబాద్ : ప్రజల కోసం పనిచేసే పోలీసులు ప్రశాంతంగా విధులు నిర్వర్తించగలిగితే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని అన్నారు ఎంఈఐఎల్ కంపెనీ డైరెక్ట‌ర్, సుధారెడ్డి ఫౌండేష‌న్ చైర్మ‌న్ సుధా రెడ్డి. పోలీసులకు సహకారం అందించేందుకు ఎపుడూ సిద్ధంగా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. మాదాపూర్ డీసీపీ రితిరాజ్ మాట్లాడుతూ పోలీసులు కష్టతరమైన విధులు నిర్వర్తిస్తుంటారని వారి సంక్షేమం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పోలిసుల సంక్షేమానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ కృషి చేస్తుందని, అదే సమయంలో స్వచ్చంద సంస్థల సహకారం కూడా ఈ విషయంలో ఆల‌చించాల‌ని కోరారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా సాయం చేసేందుకు పోలీస్ లు సిద్ధంగా ఉంటారని అలాంటి వారికి అండగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

పోలీసుల సంక్షేమానికి ఎం ఈ ఐ ఎల్ చేస్తున్న కృషిని రితిరాజ్ అభినందించారు. తమ బెటాలియన్ లో జిమ్ ఏర్పాటు చేయాల్సిందిగా కమాండెంట్ రామకృష్ణ సుధారెడ్డి ని కోరగా ప్రతిపాదన పంపిస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నానక్ రాంగూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్ భవనం నలువైపులా కొండాపూర్ లోని టి ఎస్ ఎస్ పీ సిబ్బంది 24 గంటలు కాపలా కాస్తుంటారు. ఒక్కో షిఫ్ట్ లో 24 మంది విధుల్లో ఉంటారు. ఇప్పటి వరకు వీరు పాత ఇనుప కంటైనర్లలో లో ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకునే వారు. అక్కడ సరైన వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వారి ఇబ్బందిని గమనించిన బెటాలియన్స్ అదనపు డి జీ పీ సంజయ్ కుమార్ జైన్ సూచనతో బెటాలియన్స్ కమాండెంట్ రామకృష్ణ , అసిస్టెంట్ కమాండెంట్‌లు ఎం.పార్ధసారధి రెడ్డి, ఎస్.రాంబాబు తదితరులు ఎం ఈ ఐ ఎల్ యాజమాన్యాన్ని కలిసి తమ సిబ్బంది విశ్రాంతి తీసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరారు.

ప్రజల రక్షణకు నిరంతరం కృషి చేసే పోలీసులకు సహాయ పడటంలో ఎపుడూ ముందుండే ఎం ఈ ఐ ఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి, డైరెక్టర్ సుధారెడ్డి అందుకు తమ సమ్మతిని తెలిపారు. విశ్రాంతి గృహాన్ని విశాలంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఒకేసారి 50 మంది పోలీసులు విశ్రాంతి తీసుకునేలా నాలుగు ఏ సిలు, 24 ఫ్యాన్ల సౌకర్యంతో బ్యారెక్స్ నిర్మిస్తున్నారు. పోలీసులు కాలకృత్యాలు తీర్చుకునేందుకు ప్రత్యేకంగా ఒక భవనాన్ని ఎం ఈ ఐ ఎల్ నిర్మిస్తోంది. అమెరికన్ కాన్సులేట్ భద్రతా సిబ్బందితో పాటు అక్కడ విధులు నిర్వర్తించే సైబరాబాద్ పోలీసులు కూడా ఈ భవనాలు వినియోగించు కోనున్నారు. హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ దక్షిణ ఆసియాలోనే పెద్దది. ప్రతి రోజు 3500 వీసా దరఖాస్తులను స్వీకరించే సామర్ధ్యంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించే ఈ కార్యాలయాన్ని పోలీసులు నిరంతరం కాపలా కాస్తుంటారు. వీరి సౌకర్యార్ధం ఎం ఈ ఐ ఎల్ ఈ నిర్మాణాన్ని చేపట్టింది.

  • Related Posts

    గోదావ‌రి డెల్టా కింద 10.13 ల‌క్ష‌ల ఎక‌రాలు సాగు

    Spread the love

    Spread the loveశాస‌న స‌భ‌లో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు అమ‌రావ‌తి : ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, నీటి ల‌భ్య‌త గురించి స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. గురువారం శాస‌న…

    ఆవిష్కరణలు, నైపుణ్యాలకు స‌ర్కార్ ప్ర‌యారిటీ

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ‘ఏపీ అంటే పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించామ‌న్నారు. ఏపీ అంటే బ్రాండ్ అనే పేరు మళ్లీ తీసుకువచ్చామ‌ని తెలిపారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *