టెక్నాల‌జీ రంగంలో పెను సంచ‌ల‌నం ఏఐ

Spread the love

భార‌తీయ యువ ఇంజ‌నీర్లు స‌త్తా చాటాలి

న్యూఢిల్లీ : యావ‌త్ ప్ర‌పంచాన్ని టెక్నాల‌జీ షేక్ చేస్తోంది. రోజు రోజుకు పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ఉన్న‌ది రేపు లేకుండా పోతోంది. ఈ త‌రుణంలో భారత దేశానికి చెందిన యువ‌త మ‌రింత దృష్టిని సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు పీఎం. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. భారతీయ స్టార్టప్ ప్రపంచంలోని యువకులతో AI గురించి మాట్లాడటం ఆనందంగా ఉంద‌న్నారు. ఇది ఒక చిరస్మరణీయమైన, అంతర్దృష్టితో కూడిన సంభాషణగా ఆయ‌న పేర్కొన్నారు.

దీనిలో వారు భారతదేశం AI ప్రపంచాన్ని ఎలా మారుస్తుందనే దానిపై వారి దృష్టి ,పనిని పంచుకున్నారని తెలిపారు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఈ స్టార్టప్‌లు ఇ-కామర్స్, మార్కెటింగ్, ఇంజనీరింగ్ సిమ్యులేషన్స్, మెటీరియల్ రీసెర్చ్, హెల్త్‌కేర్, మెడికల్ రీసెర్చ్, మరిన్ని వంటి విభిన్న రంగాలలో ఎలా పని చేస్తున్నాయో చూస్తే అబ్బురం అనిపిస్తుంద‌న్నారు. రాబోయే రోజుల‌లో ప్ర‌పంచాన్ని శాసించే కంపెనీల‌లో ఇండియ‌న్లు మ‌రింత‌గా ఎదగాల‌ని ఆయన ఆకాంక్షించారు.

  • Related Posts

    ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అవ‌క‌త‌వ‌క‌లు : రాజ్ థాక్రే

    Spread the love

    Spread the loveమ‌రాఠా స‌ర్కార్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు మ‌హారాష్ట్ర : మ‌హారాష్ట్ర‌ న‌వ నిర్మాణ సేన పార్టీ అధ్య‌క్షుడు రాజ్ థాక్రే నిప్పులు చెరిగారు. ఆయ‌న తాజాగా ఎన్నిక‌ల క‌మిష‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో…

    ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసివేత

    Spread the love

    Spread the loveఅమెరికాతో తీవ్ర ఉద్రిక్త‌త‌ల దృష్ట్యా ఇరాన్ : ఇరాన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. అమెరికా ఇరాన్ పై తీవ్ర ఆంక్ష‌లు ప్ర‌క‌టించ‌డంతో పాటు ఏకంగా యుద్దానికి సిద్దం అవుతున్న‌ట్లు ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *