బాధ్యతగా మెలగాలి తప్పా బ‌రి తెగిస్తే ఎలా..?

Spread the love

నిప్పులు చెరిగిన ఐఏఎస్ అధికారుల సంఘం

హైద‌రాబాద్ : ఒక బాధ్య‌త క‌లిగిన న్యూస్ ఛాన‌ల్ గా ఉండాల్సిన ఎన్టీవీ న్యూస్, ఎంట‌ర్టైన‌ర్ ఛాన‌ల్ అత్యంత జుగుస్సాక‌రంగా , వ్య‌క్తిగ‌త ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డం దారుణ‌మ‌న్నారు ఐఏఎస్ అధికారుల సంఘం కార్య‌ద‌ర్శి, సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జ‌యేష్ రంజ‌న్. ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మహిళ సీనియర్ ఐఏఎస్ అధికారిణిపై వ్య‌క్తిగ‌తంగా డ్యామేజ్ చేసేలా క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఆధారాలు లేకుండా ఎలా ప్ర‌సారం చేస్తారంటూ ప్ర‌శ్నించారు.

త‌క్ష‌ణ‌మే ఇలాంటి చ‌వ‌క‌బారు, నీతి మాలిన క‌థ‌నాల‌ను టెలికాస్ట్ చేసినందుకు గాను బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని జ‌యేష్ రంజ‌న్ డిమాండ్ చేశారు. అంతే కాకుండా భేషరతుగా క్షమాపణలు చెప్పాల‌ని లేక పోతే చట్ట పరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. ప్ర‌ధానంగా మీడియా సంస్థలు బాధ్యతగా మెలగాలి తప్ప బరి తెగించవద్దని హితవు ప‌లికారు సీనియ‌ర్ అధికారి, కార్య‌ద‌ర్శి. ఈ మేరకు మీడియాకు లేఖ విడుదల చేశారు అసోసియేషన్ సెక్రటరీ జయేష్ రంజన్.

  • Related Posts

    ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అవ‌క‌త‌వ‌క‌లు : రాజ్ థాక్రే

    Spread the love

    Spread the loveమ‌రాఠా స‌ర్కార్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు మ‌హారాష్ట్ర : మ‌హారాష్ట్ర‌ న‌వ నిర్మాణ సేన పార్టీ అధ్య‌క్షుడు రాజ్ థాక్రే నిప్పులు చెరిగారు. ఆయ‌న తాజాగా ఎన్నిక‌ల క‌మిష‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో…

    ఇరాన్ ఎయిర్ స్పేస్ మూసివేత

    Spread the love

    Spread the loveఅమెరికాతో తీవ్ర ఉద్రిక్త‌త‌ల దృష్ట్యా ఇరాన్ : ఇరాన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. అమెరికా ఇరాన్ పై తీవ్ర ఆంక్ష‌లు ప్ర‌క‌టించ‌డంతో పాటు ఏకంగా యుద్దానికి సిద్దం అవుతున్న‌ట్లు ఆ దేశ అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *