ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు

Spread the love

ఇప్ప‌టికే మాజీ మంత్రి హ‌రీశ్ రావు విచార‌ణ

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు కీల‌క మ‌లుపు తిరుగుతోంది. ఈనెల 23న శుక్ర‌వారం త‌మ ఎదుట హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈమేర‌కు మాజీ మంత్రికి నోటీసులు జారీ చేసింది. కాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో ఉద‌యం 11.25 గంట‌ల నుండి రాత్రి 7 గంట‌ల కు పైగా సిట్ విచార‌ణ ఎదుర్కొన్నారు. రెండు రోజుల అనంత‌రం ఈ సిట్ చ‌ర్య తీసుకుంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో తన దర్యాప్తును ముమ్మరం చేస్తూ, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గురువారం మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు నోటీసు జారీ చేసింది, శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని కోరింది. కాగా నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో ఈ నోటీసును అందజేశారు. మ‌రో వైపు సిట్ ను రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ ప్ర‌త్యేక విచార‌ణ క‌మిటీని ఏర్పాటు చేసింది. దీంతో విచార‌ణ క‌మిటీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా నోటీసులు జారీ చేయ‌డం మొద‌లు పెట్టింది.

  • Related Posts

    సింగ‌రేణి స్కాం కిష‌న్ రెడ్డి మౌనం దేనికోసం ..?

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లలో భారీ స్థాయిలో…

    రాయలసీమ ద్రోహి జగన్ మోహ‌న్ రెడ్డి

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత అమరావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఆమె మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *