హైడ్రా కాపాడిన పార్కులో వనభోజనాలు

Spread the love

సత్యనారాయణ వ్రతం నిర్వహించి సంబరాలు

హైద‌రాబాద్ : హైడ్రాకు రోజు రోజుకు న‌గ‌ర వాసుల నుంచి మ‌ద్ద‌తు పెరుగుతోంది. నిజాంపేట మున్సిపాలిటీ కోశల్యానగర్లోని హైడ్రా కాపాడిన బనియన్ ట్రీ పార్కులో స్థానికులు వన భోజనాలు చేశారు. కార్తీకమాసం కావడంతో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. నిజాంపేట మున్సిపాలిటీలో ఇటీవల రెండు పార్కులను హైడ్రా కాపాడింది. బృందావ‌న్ కాల‌నీలో 2300 గ‌జాల పార్కును కాపాడ‌గా, కౌశ‌ల్యానగర్ కాల‌నీలోని 300ల గజాల విస్తీర్ణంలో ఉన్న బ‌నియ‌న్ ట్రీ పార్కును క‌బ్జాల నుంచి ర‌క్షించింది. కౌశల్యానగర్ కాలనీలోని 300 గజాల పార్కుకు చుట్టూ ఆక్రమణదారులు ప్రహరీ నిర్మించి కాజేశారు. ఎవరూ పార్కులోకి రాకుండా అడ్డుకున్నారు.

అలా ఆక్రమణలో వున్న పార్కును కాపాడి కోశల్యానగర్ కాలనీ వాసులకు హైడ్రా అప్పగించింది. అందుకే కాలనీవాసులు బనియన్ ట్రీ పార్కుకు చేరుకుని కార్తీక వనభోజనాలు చేశారు. అదే పార్కులో కాలనీ వాసులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వ‌హించ‌డం విశేషం. దాదాపు వెయ్యి మంది కలసి ఈ ఉత్సవాలను జరుపుకున్నారు. పిల్లలు పెద్దలు హైడ్రా జిందాబాద్..అంటూ హైడ్రా కి హైడ్రా అధికారులకు కృతజ్ఞతలు తెలియ చేసారు. ప్లకార్డులు ప్రదర్శించి హైడ్రాకు మద్దతు పలికారు. అలాగే బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో ఫార్చ్యూన్ మెడోస్ కాలనీలో అడ్డుగోడలు తొలగించి వెనువెంటనే సిమెంట్ రోడ్డు వేసిన హైడ్రాకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. హైడ్రా వచ్చింది దారులు తెరిచిందంటూ కీర్తించారు.

  • Related Posts

    ప‌టిష్ట‌వంతంగా పంటల బీమా వ్యవస్థ

    Spread the love

    Spread the loveవ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : పంటల భీమా విషయంలో గత ప్రభుత్వ విధానం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి పసల్ భీమా యోజనలో దేశంలోని…

    గోదావ‌రి డెల్టా కింద 10.13 ల‌క్ష‌ల ఎక‌రాలు సాగు

    Spread the love

    Spread the loveశాస‌న స‌భ‌లో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు అమ‌రావ‌తి : ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, నీటి ల‌భ్య‌త గురించి స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. గురువారం శాస‌న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *