ప్ర‌జా పాల‌నలో విద్యా రంగం నాశ‌నం

Spread the love

సీఎం రేవంత్ రెడ్డిపై హ‌రీశ్ రావు ఆగ్ర‌హం

హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్ర‌జా పాల‌న‌లో విద్యా, వైద్య రంగాలు భ్ర‌ష్టు ప‌ట్టి పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ద‌విని అడ్డం పెట్టుకుని ప్ర‌జా ధ‌నాన్ని త‌న విలాసాలు, వ్య‌క్తిగ‌త ప్ర‌చారం కోసం ఖ‌ర్చు చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు సీఎం ఏకంగా రూ. 100 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఈ డ‌బ్బుల‌తో పాఠ‌శాల‌లు, గురుకులాలు, సంక్షేమ హాస్ట‌ళ్ల కోసం కేటాయిస్తే బాగుండేద‌న్నారు హ‌రీశ్ రావు. ఇక‌నైనా ఇలాంటి చిల్ల‌ర ప‌నులు చేయొద్ద‌ని సూచించారు.

ఓ వైపు రాష్ట్రం అప్పుల పాలైంద‌ని ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్న సీఎం ఇంత భారీ ఎత్తున ఎవ‌రి కోసం ఖ‌ర్చు పెడుతున్నారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు . ఒక బాధ్య‌తాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న రేవంత్ రెడ్డి పూర్తిగా పాల‌న‌ను గాలికి వ‌దిలి వేశార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఓ వైపు పిల్ల‌ల‌కు స‌రైన ఆహారం అంద‌డం లేద‌ని, ఏకంగా పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి త‌మ గోడు వెళ్ల బోసుకున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రామ‌ర్శించిన పాపాన పోలేద‌న్నారు. అడ్డ‌గోలు హామీలతో ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన స‌ర్కార్ ఇప్పుడు అన్నింటిని ప‌క్క‌న పెట్టింద‌న్నారు. ఎవ‌రు క్ష‌మించినా ప్ర‌జ‌లు క్ష‌మించే ప్ర‌సక్తి లేద‌న్నారు హ‌రీశ్ రావు.

  • Related Posts

    ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

    Spread the love

    Spread the loveమ‌రాఠా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచల‌నంగా మారారు మంత్రి మ‌రాఠాకు చెందిన గిరీష్ మ‌హాజ‌న్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధ‌వారం స్పందించారు. అది తప్పు అని నేను అనను అన్నారు.…

    రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    Spread the love

    Spread the loveఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్ చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *