ఇమ్రాన్ ఖాన్, భార్య‌కు 17 ఏళ్ల జైలు శిక్ష

పాకిస్తాన్ కోర్టు సంచ‌ల‌న తీర్పు

పాకిస్తాన్ : పాకిస్తాన్ అత్యున్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఇప్ప‌టికే జైలుపాలై శిక్ష‌ను అనుభ‌విస్తున్న మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయ‌న భార్య‌కు 17 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. త‌ను అధికారంలో ఉన్నప్పుడు సౌదీ అరేబియా ప్రభుత్వం నుండి వచ్చిన ఆభరణాలతో సహా బహుమతులను వాటి మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు విక్రయించారని వారిపై ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్ చట్టం ప్రకారం, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు విదేశీ ప్రముఖుల నుండి అందుకున్న బహుమతులను తమ వద్ద ఉంచుకోవాలంటే, వాటిని అంచనా వేసిన మార్కెట్ ధరకు కొనుగోలు చేసి, వాటిని అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రకటించాల్సి ఉంటుంది.

జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అతని భార్యను ప్రభుత్వ బహుమతులను అక్రమంగా ఉంచుకుని, విక్రయించినందుకు దోషులుగా నిర్ధారించింది పాకిస్తాన్ కోర్టు . శనివారం వారికి 17 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇది కోలుకోలేని షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదిలా ఉండ‌గా గత సంవత్సరం వారిపై అభియోగాలు మోపినప్పుడు ఆ దంపతులు తాము నిర్దోషులమని వాదించారు. ఇమ్రాన్ ఖాన్ , అతని భార్య అధికారికంగా ప్రకటించని బహుమతులను తిరిగి అమ్మడం ద్వారా డబ్బు సంపాదించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని కోర్టుకు స‌మ‌ర్పించ‌డంతో బిగ్ షాక్ ఇస్తూ శిక్ష విధించారు న్యాయ‌మూర్తి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *