టాటా చైర్మన్ చంద్రశేఖరన్‌తో సీఎం భేటీ

కీలక అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చ‌లు

దావోస్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు గురువు చంద్ర‌బాబు నాయుడు ఇంకో వైపు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇద్ద‌రూ దావోస్ లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు. వివిధ కంపెనీల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ రైజింగ్ లో భాగం పంచుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్బంగా దిగ్గ‌జ కంపెనీ టాటా గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌రన్ తో రేవంత్ రెడ్డి ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. కీల‌క అంశాలు చ‌ర్చించారు. విజన్–2047 లక్ష్యాలు పెట్టుబడులకు ఉన్న అనుకూల విధానాలను వివరించారు టాటా గ్రూప్ చైర్మ‌న్ కు సీఎం రేవంత్ రెడ్డి.

హైదరాబాద్ లో స్టేడియాల అభివృద్ధికి టాటా సహకారం అందించాల‌ని కోరారు. ఈ సంద‌ర్బంగా సీఎం చేసిన విన్న‌తికి సానుకూలంగా స్పందించారు టాటా చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్. అంతే కాకుండా స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్ట‌బోయే మూసీ నది పునరుజ్జీవనంలో భాగస్వామ్యం అయ్యేందుకు కూడా టాటా ఆసక్తి చూపించ‌డం విశేషం. అంతే కాకుండా తెలంగాణ‌లో హొటళ్లు, రిసార్ట్స్ ఏర్పాటు కోసం కూడా స‌పోర్ట్ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో కొత్త మానుఫాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు చర్చలు జ‌ర‌ప‌డం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *