కుల ప్రాతిప‌దిక‌న ప‌ద‌వులు రాలేదు : ర‌మేష్

టీవీకే లౌకిక వాదానికి క‌ట్టుబ‌డి ఉంద‌న్న మంత్రి

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి ర‌మేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిప‌క్ష పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు చేస్తున్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని పేర్కొన్నారు. శ‌నివారం ఆయ‌న చెన్నైలో మీడియాతో మాట్లాడారు. త‌మ పార్టీ లౌకిక వాదానికి క‌ట్టుబ‌డి ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇప్ప‌టికే త‌మ పార్టీ నాయ‌కుడు, సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ పార్టీ పెట్టిన స‌మ‌యంలో, ప్ర‌చారం సంద‌ర్బంగా జ‌రిగిన స‌భ‌ల‌లో, కార్న‌ర్ మీటింగ్ ల‌లో , చివ‌ర‌కు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యంలో కూడా సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డి ఉంటామ‌ని ప్ర‌క‌టించార‌ని చెప్పారు ర‌మేష్‌.

కానీ ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్ర‌తిప‌క్షాలకు అల‌వాటుగా మారింద‌న్నారు. టీవీకే లౌకికవాదానికి, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందన్నారు. నాకు గానీ, డిప్యూటీ స్పీకర్ రవిశంకర్‌కు గానీ కుల గుర్తింపు ఆధారంగా ఓట్లు రాలేదన్నారు ర‌మేష్, ముఖ్యమంత్రి విజ‌య్ నాయకత్వం వల్లే వచ్చాయ‌న్నారు. ప్రజలు ముఖ్యమంత్రిని కుల, మత భేదాలకు అతీతంగా తమ సొంత కుటుంబ సభ్యునిగా భావించారని పేర్కొన్నారు. ఇదే భావన పార్టీ అభ్యర్థులకు, మంత్రులకు కూడా వర్తించిందన్నారు. కుల ప్రాతిపదికన ఏ పదవులూ ఇవ్వలేదన్నారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *