నటుడు..దర్శఖుడు రిషబ్ శెట్టి
అయోధ్య – ప్రముఖ సినీ నటుడు , దర్శకుడు, నిర్మాత కన్నడ సినీ రంగానికి చెందిన రిషబ్ శెట్టి హల్ చల్ చేశారు. ఆయన అయోధ్య లోని రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో తన భార్యతో కలిసి పాల్గొన్నారు. తనకు ప్రత్యేకంగా రామ జన్మ భూమి ట్రస్టు ఆహ్వానం పలికింది. శ్రీరాముడి దివ్య దర్శనం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఫోటోలను షేర్ చేశారు.
ఇదిలా ఉండగా శ్రీరామ జన్మ భూమి ట్రస్టు దేశంలోని సినీ, క్రీడా, రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన 7,000 వేల మందికి పైగా ప్రముఖులను పిలిచింది. వారికి సకల ఏర్పాట్లు చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొన్నారు. ఆయనతో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరయ్యారు.
శ్రీరాముడి విగ్రహానికి తన చేతితో తిలకం దిద్దారు ప్రధానమంత్రి. ఈ అపురూపమైన, అరుదైన ఘట్టాన్ని కోట్లాది మంది వీక్షించారు. 500 ఏళ్ల తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరకు ఆలయంగా రూపు దిద్దుకుంది. కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు.
ఇక హనుమాన్ చిత్ర దర్శకుడు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తమ సినిమాకు సంబంధించి అమ్ముడు పోయిన టికెట్ కు రూ. 5 చొప్పున రామ జన్మ భూమి ట్రస్టుకు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రూ. 2 కోట్లకు పైగా ఇప్పటికే ఇచ్చారు.