రికార్డ్ బ్రేక్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు
అమరావతి – ఏపీ ప్రభుత్వం ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా యోగా డేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు శ్రీకారం చుట్టింది. అదే రోజు విశాఖపట్టణంలో పెద్ద ఎత్తున యోగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవుతున్నారు. 5 లక్షల మంది పాల్గొంటారని ఈ సందర్బంగా వెల్లడించారు సీఎం చంద్రబాబు. ఒకే రోజు యోగా డేలో పాల్గొనేందుకు 2 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు యోగా కార్యక్రమంలో పాల్గొంటే సర్టిఫికెట్ ఇస్తామన్నారు.
ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పై దృష్టి సారించాలన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. పలు పథకాల అమలుపై సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ముఖ్య పథకాలన్నీ ఏడాదిలోపే అమలు చేస్తున్నామని చెప్పారు. విచ్చలవిడి అప్పులతో గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. 67.27 లక్షల మంది విద్యార్థులకు రూ.10 వేల కోట్లు తల్లికి వందనం పథకాలు విడుదల చేశామని వెల్లడించారు సీఎం.
ఇందులో భాగంగా తల్లుల అకౌంట్లో రూ.13 వేలు, పాఠశాలల అభివృద్ధికి రూ.2 వేలు కేటాయిస్తున్నామని చెప్పారు. పాఠశాలలు తెరిచేలోపే పథకం అమలు చేస్తామని చెప్పి చేశామన్నారు. ఒక బిడ్డ ఉన్న తల్లులు 18,55,760 మంది, ఇద్దరు బిడ్డలు ఉన్న తల్లులు 14,55,322 మంది, ముగ్గరు బిడ్డలు ఉన్న తల్లులు 2,10,684 మంది, నలుగురు బిడ్డలు ఉన్న తల్లుల 20,053 మంది ఉన్నారని వెల్లడించారు సీఎం.