అక్టోబర్ 27 నుండి శ్రీనివాస కల్యాణాలు

Spread the love

నవంబర్ 5 వరకు శ్రీకాకుళం, అల్లూరి , అనకాపల్లి జిల్లాలలో

తిరుపతి : టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో అక్టోబర్ 27 నుండి నవంబర్ 5 వరకు శ్రీకాకుళం జిల్లాలో 2 ప్రాంతాలలో, అల్లూరి సీతారామ రాజు జిల్లాలో 2 ప్రాంతాలలో, అనకాపల్లి జిల్లాలో 1 ప్రాంతంలో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి. శ్రీకాకుళం, అల్లూరి సీతారామ రాజు జిల్లాలలో ఉదయం 11 గంటలకు, అనకాపల్లి జిల్లాలో సాయంత్రం 6 గంటలకు కల్యాణాలు ప్రారంభంకానున్నాయి . అక్టోబర్ 27వ తేదీన శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మండల కేంద్రంలోని అగ్రహారం గ్రౌండ్ లో ఉదయం 11 గం.లకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది. 30వ తేదీన అల్లూరి సీతారామ రాజు జిల్లా పాడేరు మండల కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల మైదానంలో ఉదయం 11 గం.లకు స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. నవంబర్ 01వ తేదీన అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతపల్లి మండలం లోని గొందిపాకాల (లంబ సింగి) గ్రామంలోని శ్రీ నూకాలమ్మ ఆలయ ప్రాంగణంలో ఉదయం 11 గం.లకు శ్రీవారి కల్యాణం జరుగనుంది.

3వ తేదీన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్ లో సాయంత్రం 6 గం.లకు శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు. నవంబర్ 5వ తేదీన శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండల కేంద్రంలోని జీ.టీ.డబ్ల్యూ.ఏ హైస్కూల్ గ్రౌండ్ లో ఉదయం 11 గం.లకు శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు. శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయ ప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో హరికథ, సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

  • Related Posts

    టీటీడీ క‌ళ్యాణ మండ‌పాల‌పై ఈవో స్పెష‌ల్ ఫోక‌స్

    Spread the love

    Spread the loveభ‌క్తుల నుండి అభిప్రాయాల సేక‌ర‌ణ కోసం హెల్ప్ లైన్ తిరుప‌తి : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆయ‌న ఈవోగా కొలువు తీరాక టీటీడీలో ప్ర‌క్షాళ‌న ప్రారంభించారు. కీల‌క నిర్ణ‌యాలకు శ్రీ‌కారం చుట్టారు.…

    తిరుమలలో 3 రోజులు SSD టోకెన్లు బంద్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన టీటీడీ తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుమలలో ఈనెల 25న రథ సప్తమి సందర్భంగా 24, 26వ తేదీల వరకు SSD టోకెన్ల జారీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *