ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌ను ఆలోచించండి : కేటీఆర్

Spread the love

ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాల‌నకు చెక్ పెట్టండి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసిన ఘ‌న‌త కేసీఆర్ కు ద‌క్కుతుంద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గంలోని షేక్‌పేట్‌లోని సత్వా గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ వాసులతో ఆదివారం స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌సంగించారు. ప‌దేళ్లలో పేద‌ల కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని అన్నారు. యావ‌త్ ప్ర‌పంచం హైద‌రాబాద్ వైపు చూసేలా అభివృద్ది చేయడం జ‌రిగింద‌న్నారు కేటీఆర్. క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీ ముబార‌క్ వంటి ప‌థ‌కాల‌తో పేద కుటుబాల‌కు అండ‌గా నిలిచామ‌ని చెప్పారు. వ్య‌వ‌సాయానికి, ప‌రిశ్ర‌మ‌ల‌కు 24 గంటల క‌రెంటు ఇచ్చాం, నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌కు జీవం పోశామ‌న్నారు. ప్ర‌పంచంలోనే అతి పెద్ద కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మించామ‌ని అన్నారు. బెంగ‌ళూరు లాంటి న‌గ‌రాల్లో ఏడేళ్లు ప‌ట్టే ఫ్లై ఓవ‌ర్ల‌ను మేం అతి త‌క్కువ కాలంలోనే చేశామ‌ని తెలిపారు. ఎన్నో ప‌నులు నాలుగేళ్ల‌లో పూర్తి చేశామ‌న్నారు.

ఈ రెండేళ్ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఏం చేసిందో ఒక్క‌సారి బేరీజు వేసుకోవాల‌ని సూచ‌చించారు కేటీఆర్. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆగ‌మాగం అవుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వ‌ర‌ల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేష‌న్ క్యాంప‌స్ అని అడిగితే టీ హ‌బ్ అని చూపిస్తుందన్నారు. దీనిని ఏర్పాటు చేసింది మేమేన‌ని మీకు తెలియంది కాద‌న్నారు. మేం దేశంలోనే కాదు ప్ర‌పంచం తోనే పోటీప‌డ్డాం అని అన్నారు. మా హ‌యాంలో త‌ల‌స‌రి ఆదాయం రూ. 3.87 ల‌క్ష‌లుగా మార్చేశామ‌న్నారు కేటీఆర్. తాము వ‌చ్చాక 6 ల‌క్ష‌ల ఉద్యోగుల‌ను ఐటీ రంగంలో క‌ల్పించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ ఎన్నిక కారుకు బుల్డోజ‌ర్ కు మ‌ధ్య జ‌రుగుతున్న పోరాటం అని పేర్కొన్నారు.

  • Related Posts

    బ‌తికి ఉన్నంత వ‌ర‌కు ఎమ్మెల్యేగా పోటీ చేయ‌ను

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన టీపీసీసీ నేత జ‌గ్గారెడ్డి హైద‌రాబాద్ : టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను బ‌తికి ఉన్నంత వ‌ర‌కు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నంటూ ప్ర‌క‌టించారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు.…

    క్లీన్ ఎనర్జీ దిశ‌గా ఆంధ్ర‌ప్ర‌దేశ్ : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

    Spread the love

    Spread the loveఇందులో పాలు పంచుకోవ‌డం ఆనందంగా ఉంది అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భవిష్యత్తు కోసం ప్రపంచం పరిశుభ్రమైన, మరింత స్థిరమైన ప్రత్యామ్నాయాలను చురుగ్గా అన్వేషిస్తోందని అన్నారు. గ్రీన్ అమ్మోనియా అటువంటి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *