పురుషుల‌తో స‌మానంగా మ‌హిళా క్రికెట్

Spread the love

మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కీల‌క కామెంట్స్

ముంబై : భార‌త మ‌హిళా జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ మిథాలీ రాజ్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. దేశంలో పురుషుల‌తో స‌మానంగా మ‌హిళ‌లు కూడా క్రికెట్ లో రాణిస్తున్నార‌ని , ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ భార‌త మ‌హిళా జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకోవ‌డ‌మేన‌ని పేర్కొన్నారు. ఇండియా క‌ప్ గెలిచాక మీడియాతో మాట్లాడారు మిథాలీ రాజ్. ఇదే స‌మ‌యంలో దేశంలో మహిళల క్రికెట్‌ను పెంపొందించడంలో బీసీసీఐ ఇచ్చిన మ‌ద్ద‌తు మ‌రిచి పోలేమ‌న్నారు. అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందించింద‌ని పేర్కొన్నారు. ఇందు వ‌ల్ల‌నే ఉమెన్ ఇన్ బ్లూ అన్ని రంగాల‌లో స‌త్తా చాటార‌ని అన్నారు. తాము చేయ‌లేని ప‌నిని ఇప్పుడున్న మ‌హిళా క్రికెట‌ర్లు చేశార‌ని, సాధించార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు మిథాలీ రాజ్.

2005, 2017లో భార‌త జ‌ట్టు ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ దాకా వెళ్లింది. కానీ అదృష్టం త‌మ వైపు ఉండ‌లేద‌న్నారు . కానీ 2025లో హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ ప‌టిష్ట‌వంత‌మైన నాయ‌క‌త్వంలో భార‌త జ‌ట్టు అద్భుతం చేసింద‌న్నారు. క‌ళ్ల ముందు కాద‌నుకున్న దానిని ఆచ‌ర‌ణ‌లో చేసి చూపించారంటూ పేర్కొంది మాజీ కెప్టెన్. ఆనాడు ఇంగ్లండ్ చేతిలో తాము ఓడి పోవ‌డం ఇప్ప‌టికీ బాధ క‌లిగిస్తోంద‌ని చెప్పారు. ఆట అన్నాక గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌న్నారు. ఇదే స‌మ‌యంలో ఏడుసార్లు ఛాంపియ‌న్ గా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించిన తీరు అద్బుత‌మ‌న్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు దేశం కోసం ఆడార‌ని, అనుకున్న‌ది సాధించార‌ని చెప్పారు.

  • Related Posts

    త‌ట‌స్థ ప్ర‌దేశాల‌లోనే మ్యాచ్ లు ఆడుతాం

    Spread the love

    Spread the loveఐసీసీకి స్ప‌ష్టం చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భాగంగా తాము ఇండియాలో జ‌రిగే కీల‌క మ్యాచ్ ల‌ను…

    ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 బ‌రువు 6,175 కిలోలు

    Spread the love

    Spread the love18 క్యారెట్ బంగారంతో ట్రోఫీ త‌యారీ న్యూఢిల్లీ : అమెరికా వేదిక‌గా ఈ ఏడాది ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే మిలియ‌న్ల కొద్దీ టికెట్లు అమ్ముడు పోయాయి. ఈసారి ట్రోఫీని కోకో కోలా స్పాన్స‌ర్ చేస్తోంది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *