త‌మ్మ‌డికుంట చెరువును కాపాడిన‌ హైడ్రాకు థ్యాంక్స్

Spread the love

ధ‌న్య‌వాదాలు తెలుపుతూ స్థానికుల భారీ ప్ర‌ద‌ర్శ‌న

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఆక్ర‌మ‌ణ‌కు గురైన చెరువుల‌ను కాపాడే ప‌నిలో ప‌డింది. తాజాగా ఐటీ కారిడార్ కి , శిల్పారామానికి చేరువగా మాదాపూర్లో ఉన్న తమ్ముడికుంట చెరువు రూపు రేఖలు పూర్తిగా మార్చేసింది హైడ్రా. ఒకపుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. అంతే కాకుండా దుర్గంధభరిత వాతావరణంలో దోమలు, క్రిమి కీటకాలతో ఉన్న ఈ పరిసరాల రూపురేఖలను హైడ్రా మార్చేసింది. ఈ సంద‌ర్బంగా స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేప‌ట్టారు. ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వహించారు.

రోడ్డులు, పార్కుల ఆక్రమణలను తొలగించిందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అల్మాస్ గూడ బోయపల్లి ఎన్ క్లెవ్ కాలనీలో లేఔట్ ప్రకారం ఉన్న రోడ్లు, పార్కులను హైడ్రా కాపాడిందంటూ స్థానికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సంద‌ర్బంగా హైడ్రాకు, స‌ర్కార్ కు కృత‌జ‌త‌లు తెలియ చేశారు. హైడ్రాను ఏర్పాటు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డిని అభినందించారు. పూర్తి స్థాయి లో కాలనీ అభివృద్ధికి కృషి చేయాల‌ని, కాలనీ పార్క్ ను అభివృద్ధి చేయాలని, రోడ్లు బాగు చేయాలని కోరారు. హుస్సేనీ ఆలయంలో ఫాతిమా కాలనీలో కూడా హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు.

  • Related Posts

    గోదావ‌రి డెల్టా కింద 10.13 ల‌క్ష‌ల ఎక‌రాలు సాగు

    Spread the love

    Spread the loveశాస‌న స‌భ‌లో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు అమ‌రావ‌తి : ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, నీటి ల‌భ్య‌త గురించి స్ప‌ష్ట‌త ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. గురువారం శాస‌న…

    ఆవిష్కరణలు, నైపుణ్యాలకు స‌ర్కార్ ప్ర‌యారిటీ

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ‘ఏపీ అంటే పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించామ‌న్నారు. ఏపీ అంటే బ్రాండ్ అనే పేరు మళ్లీ తీసుకువచ్చామ‌ని తెలిపారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *