ఏపీ మారిటైమ్ బోర్డులో రూ. 12,255 కోట్లు

ఎంఓయూ చేసుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వం

విశాఖ‌పట్నం : ఏపీ స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సు శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్ర‌ప‌తి రాదాకృష్ణ‌న్, గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ తో పాటు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, కేంద్ర మంత్రులు పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్, రామ్మోహ‌న్ నాయుడు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా విశాఖ నోవాటెల్ లో జరిగిన సీఐఐ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పెట్టుబడులపై అవగాహన ఒప్పందాల (MOUs) సంతకాల కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, సహచర మంత్రులు పి. నారాయణ, టీజీ భరత్, సీఎస్ విజయానంద్, ఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య, ఏపీ ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ ఛైర్మన్ జెడ్. శివప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ఏపీ మారిటైమ్ బోర్డుతో రూ. 12,255 కోట్ల పెట్టుబడుల కోసం మూడు సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని మారిటైమ్ రంగంలో దాదాపు 1300 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్ర‌క‌టించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌.

  • Related Posts

    విద్య‌తోనే వికాసం అభివృద్దికి సోపానం

    స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి అమ‌రావ‌తి : జీవితాన్ని ప్ర‌భావితం చేసేది ఒక్క‌టేన‌ని అది విద్య అని గుర్తించాల‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. చ‌దువుతోనే మ‌నిషిలో సంస్కారం అల‌వ‌డుతుంద‌ని అన్నారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని,…

    రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం

    స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు అత్యంత స‌హ‌జ‌మ‌ని , కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జ‌రిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *