స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం : యావత్ ప్రపంచాన్ని రాబోయే కాలంలో ఏఐ శాసిస్తుందని అన్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. AI and the Future of Jobs Turning Disruption into Opportunity అనే అంశంపై సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ ప్రాంగణంలో జరిగిన సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని AI గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఈజ్ ఇండియా రెడీ ఫర్ అథెంటిక్ ఏఐ’ నివేదికను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. అనంతరం నారా లోకేష్ సమక్షంలో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎండీ, సీఐఐ వైస్ ప్రెసిడెంట్ సుచిత్ర కె.ఎల్లాతో సీఐఐ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక భవిష్యత్తు అంతా ఏఐ చేతుల్లోనే ఉంటుందన్నారు మంత్రి లోకేష్.
ఇదిలా ఉండగా గత రెండు రోజులలో మొత్తం రూ. 5,22,471 కోట్ల పెట్టుబడులు, 2,67,239 ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా భారీ ఎంఓయూలు కుదిరాయని తెలిపారు. విండ్–సోలార్ హైబ్రిడ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, బయోఫ్యూయల్స్, పంప్డ్ హైడ్రా స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, అగ్రివోల్టాయిక్స్, పునరుత్పాదక ఇంధన తయారీ వంటి ఆధునిక రంగాల వైపు ప్రపంచ దిగ్గజ సంస్థల ఆసక్తి రాష్ట్ర సామర్థ్యాన్ని మరోసారి నిరూపించిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వంలో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 024 ఏపీ పునరుత్పాదక ఇంధన రంగానికి నిజమైన గేమ్ ఛేంజర్గా నిలుస్తోందన్నారు.






