సీఎంతో విన్ గ్రూప్ సీఈవో ఫామ్ సాన్ చౌ భేటీ

డిసెంబర్ లో జ‌రిగే రైజింగ్ గ్లోబల్ స‌మ్మిట్ కు రావాలి

హైద‌రాబాద్ : విన్‌గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ హైద‌రాబాద్ లో సీఎం ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప‌లు అంశాల‌పై ఇరువురు చ‌ర్చించారు. త‌మ రాష్ట్రం పెట్టుబ‌డుల‌కు అనుకూల‌మైద‌ని, వెంట‌నే ఇన్వెస్ట్ చేయాల‌ని సీఎం త‌న‌ను కోరారు. ఈ సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ,బ్యాటరీ నిల్వ, పునరుత్పాదక శక్తి , భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులను పరిశీలిస్తుందని తెలిపారు సీఎం. డిసెంబర్ 8–9 తేదీలలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో పాల్గొనమని రాష్ట్రం తరపున ఫామ్ సాన్ చౌ, విన్‌గ్రూప్ చైర్మన్ శ్రీ ఫామ్ నాట్ వుయాంగ్‌లకు అధికారిక ఆహ్వానాన్ని అందించిన‌ట్లు తెలిపారు రేవంత్ రెడ్డి.

ఇదిలా ఉండ‌గా త‌మ ప్ర‌భుత్వం అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతోంద‌న్నారు. అంతే కాకుండా ఇప్ప‌టికే తెలంగాణ రైజింగ్ లో ఉంద‌ని, దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు చెప్పారు సీఎం. ఇప్ప‌టికే ఐటీ, లాజిస్టిక్, ఫార్మా, త‌దిత‌ర రంగాల‌లో హైద‌రాబాద్ వ‌ర‌ల్డ్ వైడ్ గా గుర్తింపు పొందింద‌ని చెప్పారు. పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టే వారికి తాము ఎర్ర తివాచీ ప‌రుస్తామ‌న్నారు రేవంత్ రెడ్డి.

  • Related Posts

    విద్య‌తోనే వికాసం అభివృద్దికి సోపానం

    స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి అమ‌రావ‌తి : జీవితాన్ని ప్ర‌భావితం చేసేది ఒక్క‌టేన‌ని అది విద్య అని గుర్తించాల‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. చ‌దువుతోనే మ‌నిషిలో సంస్కారం అల‌వ‌డుతుంద‌ని అన్నారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని,…

    రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం

    స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు అత్యంత స‌హ‌జ‌మ‌ని , కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జ‌రిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *