బెదిరింపులు, వేధింపుల నుంచి రక్షించండి

సీపీకి మ‌హిళా జ‌ర్న‌లిస్టుల ఫిర్యాదు

హైద‌రాబాద్ : త‌మ‌ను కావాల‌ని ల‌క్ష్యంగా చేసుకుని తీవ్ర‌మైన వేధింపుల‌కు పాల్పడుతున్నారంటూ మ‌హిళా జ‌ర్న‌లిస్టులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు. భార‌త రాజ్యాంగం ప్ర‌కారం తాము కూడా ఈ దేశ పౌరుల‌మేన‌ని, త‌మ‌కు కూడా వాక్ స్వ‌తంత్రం ఉంటుంద‌ని, ప్రాథ‌మ‌క హ‌క్కులు కూడా ఉంటాయ‌ని పేర్కొన్నారు. నానా దుర్భాష లాడుతున్నార‌ని, అడ్డ‌మైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారంటూ ఆవేద‌న చెందారు మ‌హిళా జ‌ర్న‌లిస్టులు. ట్రోలింగ్‌ భయం కలిగించడం, తమ వృత్తిపరమైన పనిని అడ్డుకోవడమే లక్ష్యంగా కనిపిస్తోందని వారు పేర్కొన్నారు.

విద్వేషపూరిత, మతపరమైన ఉద్రిక్తత కలిగించే కంటెంట్‌ను కూడా ఈ హ్యాండిల్లు విస్తృతంగా పోస్ట్ చేస్తున్నాయని తెలిపారు. సంబంధిత హ్యాండిల్లు, వ్యక్తులపై దర్యాప్తు చేసి, ఐపీసీ, ఐటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే ఆన్‌లైన్‌–భౌతిక రక్షణను కల్పించాలని విన్న‌వించారు హైద‌రాబాద్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ ను. ఈ వేధింపులు మీడియా స్వేచ్ఛపై దాడి మాత్రమేనని, మహిళా జర్నలిస్టుల గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయని చెప్పారు . హైదరాబాద్‌ సిటీ పోలీసులు సమర్పించిన సమాచారాన్ని పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

  • Related Posts

    విద్య‌తోనే వికాసం అభివృద్దికి సోపానం

    స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి అమ‌రావ‌తి : జీవితాన్ని ప్ర‌భావితం చేసేది ఒక్క‌టేన‌ని అది విద్య అని గుర్తించాల‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. చ‌దువుతోనే మ‌నిషిలో సంస్కారం అల‌వ‌డుతుంద‌ని అన్నారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని,…

    రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం

    స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు అత్యంత స‌హ‌జ‌మ‌ని , కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జ‌రిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *