డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా బస్తీ దవాఖానలో ఉన్న స్టాఫ్ నర్స్ తో మాట్లాడారు. గత ప్రభుత్వంలో సిద్దిపేటలో 4 చోట్ల బస్తి దవాఖానలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఒక్క కెసిఆర్ నగర్ లోని బస్తి దవాఖానలో మినహాయించి మిగతా మూడు బస్తి దవాఖానలు కాళ్లకుంట కాలనీ, లింగారెడ్డి పల్లి, ఆర్ అండ్ బి కార్యాలయం సమీపంలో లోన్న వాటిల్లో గత 6 నెలల నుండి డాక్టర్ లు లేక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
డాక్టర్ లేక మెడికల్ ఆఫీసర్ రూమ్ పెచ్చులు ఊడిపోయి, డాక్టర్ కూర్చునే కుర్చీలో దుమ్ము పట్టి ఉండటం పట్ల ఇదేనా బస్తి దవాఖాన తీరని, డాక్టర్లు లేకుండా ప్రజలకు వైద్యం ఎలా అందిస్తారని ప్రశ్నించారు హరీశ్ రావు. పేద ప్రజల కోసం బస్తి దవాఖాన లను ఏర్పాటు చేస్తే వాటిని స్తుస్తి దవాఖాన లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు.. ఒక వైపు 6 నెలలు గా డాక్టర్ రావడం లేదని..మరో వైపు ఉన్న అటెండర్ కు మూడు నెలలుగా జీతాలు రావడం లేదన్నారు. ఉన్న స్టాఫ్ నర్స్ కు నవంబర్ నెల జీతం ఇప్పటికి రాలేదని సీరియస్ అయ్యారు.
దవాఖాన మందుల గురించి అడిగి తెల్సుకున్నారు.. మల్టి విటమిన్, లోప్రై మెడ్ ( మోషన్స్ ట్యాబ్లేట్ ), లివో సిట్రిజన్ జలుబు ట్యాబ్లేట్, షూగర్ ట్యాబ్లేట్ మెటఫిన్ తో పాటు ఉండాల్సిన గ్లిమి ఫిరైడ్ 2mg లేవని , అదే విదంగా చిన్న పిల్లలకు సంబందించిన జింక్ సల్ఫేట్ లేవన్నారు.. డాక్టర్ వస్త లేడు.. మందులు లేవు.. అలాంటప్పుడు ప్రజలకు వైద్య సేవలు ఎలా అందుతాయని.. పేద ప్రజలకు అందించే ప్రజా వైద్యం పట్ల నిర్లక్ష్యం వీడాలని అన్నారు. వేంటనే బస్తి దవాఖానలో వైద్యులను ఏర్పాటు చేయాలని, సకాలంలో మందులు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.





