ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి
తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 4వ తేదీన తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం జరుగుతుంది. 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు. 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి అవుతాయి. 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు. 14న భోగి పండుగ ఉంటుంది.15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.
16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు. 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం. 23న వసంత పంచమి. జనవరి 25న రథ సప్తమి జరుగుతుందని స్పష్టం చేసింది టీటీడీ. ఇదిలా ఉండగా వైకుంఠ ద్వార దర్శనం సందర్బంగా భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది టీటీడీ. ఇదిలా ఉండగా మొత్తం వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి మొత్తం 10 రోజుల పాటు ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్.







