తిరుమ‌ల క‌ళ క‌ళ భ‌క్తులు కిట కిట

Spread the love

8వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం

తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమ పుణ్య క్షేత్రం భ‌క్త బాంధ‌వుల‌తో కిట కిట లాడుతోంది. రోజుకు 65 వేల మందికి పైగా భ‌క్తులు స్వామి ద‌ర్శ‌నం కోసం పోటెత్తారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నాటికి, సుమారు 41,347 మంది భక్తులు దర్శనం చేసుకోగా, 30,000 మందికి పైగా భక్తులు బటగంగమ్మ ఆలయం వరకు విస్తరించిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. వేచి ఉండే సమయం సుమారు 20 నుండి 24 గంటల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ సంద్బంగా టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్. వెంకయ్య చౌదరి మాట్లాడారు.

శుక్రవారం నుండి జనవరి 8 వరకు అన్ని దర్శనాలను సర్వ దర్శనం కోసం పూర్తిగా కేటాయించినట్లు తెలిపారు. ఆయన వివిధ విభాగాల అధికారులతో కలిసి క్యూలైన్లను , వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ను తనిఖీ చేశారు. సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి అన్ని ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనాలు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. అన్న ప్రసాదం, తాగునీరు, పాలు వంటి నిరంతర సేవలను శ్రీవారి సేవకుల ద్వారా అన్ని విభాగాలు అందిస్తున్నాయని, దర్శనానికి సంబంధించిన సూచనలను క్రమం తప్పకుండా ప్రకటిస్తున్నారని ఆయన చెప్పారు.

  • Related Posts

    అంగ‌రంగ వైభ‌వంగా ప్ర‌భ‌ల తీర్థం పండుగ‌

    Spread the love

    Spread the loveరాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభల తీర్థం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ. పురాతన శివాలయాల నుండి ఏకాదశ రుద్రులను (శివుని పదకొండు రూపాలు)…

    సీఎం చంద్ర‌బాబు దంప‌తులకు శ్రీ‌వారి ప్ర‌సాదం

    Spread the love

    Spread the loveనారా వారి ప‌ల్లెలో అందించిన‌ ఈవో సింఘాల్ తిరుప‌తి జిల్లా : సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా చిత్తూరు జిల్లాలోని నారా వారి ప‌ల్లెలో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, భార్య నారా భువ‌నేశ్వ‌రి, కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *