డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ చ‌ట్ట విరుద్దం

Spread the love

మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న తెలంగాణ స‌ర్కార్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ఎత్తి చూపారు. ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఎలా ప‌డితే అలా ముందుకు వెళితే ఎలా అని ప్ర‌శ్నించారు. శ‌నివారం శ్రీ‌నివాస్ యాద‌వ్ మీడియాతో మాట్లాడారు. GHMC అనైతిక డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. మీ ఇష్టం వచ్చినట్లు డివిజన్లు మారుస్తాము అంటే చూస్తూ ఊరుకోమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే హైదరాబాద్ పేరు మార్చమనండి అని స‌వాల్ విసిరారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ఇలా చేస్తున్నారో చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

సికింద్రాబాద్ సమీపంలో జోనల్ కమిషనర్ కార్యాలయం ఉంటే దాన్ని మల్కాజ్‌గిరిలో కలుపుతున్నార‌ని ఇదేం ప‌ద్ద‌తి అని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్. రాష్ట్రంలో ప్ర‌జా పాల‌న సాగ‌డం లేద‌ని, దీని పేరుతో పిచ్చోడి చేతిలో రాయిలా అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. అన్నింటిని , సీఎం ఒంటెద్దు పోక‌డ‌ను ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని, ఏదో ఒక రోజు త‌గిన రీతిలో బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు శ్రీ‌నివాస్ యాద‌వ్. డీలిమిటేష‌న్ ప్ర‌క్రియ‌కు వ్య‌తిరేకంగా వ్యతిరేకంగా రైలు రోకోలు, నిరహార దీక్షలు, శాంతియుత పోరాటాలు, న్యాయ పోరాటాలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

  • Related Posts

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    Spread the love

    Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    Spread the love

    Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *