సీఎం చంద్ర‌బాబు దంప‌తులకు శ్రీ‌వారి ప్ర‌సాదం

Spread the love

నారా వారి ప‌ల్లెలో అందించిన‌ ఈవో సింఘాల్

తిరుప‌తి జిల్లా : సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా చిత్తూరు జిల్లాలోని నారా వారి ప‌ల్లెలో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, భార్య నారా భువ‌నేశ్వ‌రి, కోడ‌లు నారా బ్రాహ్మ‌ణి, కొడుకు నారా లోకేష్ , మ‌న‌వ‌డు నారా దేవాన్ష్ తో పాటు కుటుంబీకులు సంద‌డి చేశారు. ప్ర‌తి పండుగ‌కు త‌న స్వంత ఊరులో సంద‌డి చేస్తారు. సీఎం రాక సంద‌ర్బంగా పెద్ద ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. ఈ స‌ద‌ర్బంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ నారా వారి పల్లెకు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం దంప‌తుల‌కు ఆ క‌లియుగ వైకుంఠ వాసుడు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి తీర్థ ప్ర‌సాదాల‌తో పాటు చిత్ర ప‌టాన్ని అంద‌జేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టిటిడి బోర్డు సభ్యులు జి.భానుప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు, టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, సివిఎస్వో కేవీ మురళీకృష్ణ, వేద పండితులు పాల్గొన్నారు.

  • Related Posts

    అంగ‌రంగ వైభ‌వంగా ప్ర‌భ‌ల తీర్థం పండుగ‌

    Spread the love

    Spread the loveరాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభల తీర్థం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ. పురాతన శివాలయాల నుండి ఏకాదశ రుద్రులను (శివుని పదకొండు రూపాలు)…

    రూ.41.14 కోట్ల హుండీ ఆదాయం 44 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం

    Spread the love

    Spread the love33 లక్ష‌ల మంది భ‌క్తుల‌కు అన్న ప్ర‌సాద విత‌ర‌ణ తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల సంద‌ర్బంగా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 41.14 కోట్లు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఆయ‌న ఈవో అనిల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *