అఖండ దీపాన్ని వెలిగించిన బండారు శ్రావ‌ణి శ్రీ‌

Spread the love

శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం

అనంత‌పురం జిల్లా : ప్ర‌తి ఏటా నిర్వ‌హించే అనంత‌పురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అంగ రంగ వైభ‌వోపేతంగా జ‌రిగింది. సింగ‌న‌మ‌ల ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ త‌న కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామివారి అఖండ దీపాన్ని వెలిగించారు. ప్రతియేటా దక్షిణ భారతదేశంలో అరుణాచలంలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. అదే సాంప్రదాయాన్ని గతేడాది నుంచి బుక్కరాయ సముద్రం, దేవరకొండ పై స్వామి వారి అఖండ దీపాన్ని వెలిగించడం ఆనందంగా ఉందన్నారు ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి శ్రీ‌.

అదేవిధంగా భక్తి శ్రద్ధలతో స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని దేవర కొండచుట్టు 3.5 కి.మీ పరిధిలో మొదటిసారిగా ప్రారంభించిన గిరిప్రదక్షణలో పాల్గొనడం పూర్వ జ‌న్మ సుకృతంగా తాను భావిస్తున్న‌ట్లు తెలిపారు బండారు శ్రావ‌ణి శ్రీ‌. శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి కృప నియోజకవర్గ ప్రజలకు నిత్యం ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించిన‌ట్లు తెలిపారు. అంత‌కు ముందు
శ్రీ కొండమీద రాయుడు వెంకటరమణ స్వామి వారి రథోత్సవ కార్యక్రమం అంగ‌రంగ వైభ‌వోపేతంగా నిర్వ‌హించారు. భారీ ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భ‌క్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఘనంగా శ్రీ కోదండ రామస్వామి పేట ఉత్సవం

    Spread the love

    Spread the loveతండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి పేట ఉత్సవం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి ఉత్సవ మూర్తులను కూపుచంద్రపేట…

    8వ తేదీ లోపు ర‌హ‌దారుల మ‌రమ్మ‌త్తులు చేప‌ట్టాలి

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి జ‌నార్ద‌న్ రెడ్డి శ్రీ‌శైలం : మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌త్తులు యుద్ద ప్రాతిప‌దిక‌న ఈనెల 8వ తేదీ లోపు పూర్తి చేయాల‌ని ఆదేశించారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *