స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత
అమరావతి : తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దిపై ఫుల్ ఫోకస్ పెట్టిందని స్పష్టం చేశారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు కీలక సూచనలు చేశారు. మీటింగ్ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. పర్యాటక, లాజిస్టిక్, ఐటీకి ఏపీని కేరాఫ్ గా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాడని తెలిపారు.
పర్యాటక, సాంస్కృతిక హబ్ గా మారుస్తున్నారని తెలిపారు. ఇటీవలే టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించిన వైకుంఠ ఏకాదశి దర్శనాలు సక్సెస్ అయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు వంగలపూడి అనిత. విశాఖలో వరల్డ్ లోనే తొలిసారిగా గూగుల్ డేటా సెంటర్ ను నెలకొల్పిందని చెప్పారు. దీని వల్ల విశాఖ పట్టణం మరింత విస్తరించే ఛాన్స్ ఉందన్నారు . సమర్థవంతమైన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకు పోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.





