లిక్కర్ స్కాం కేసులో క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు క్లీన్ చిట్

Spread the love

న్యాయ వ్య‌వ‌స్థ‌పై ఉన్న న‌మ్మ‌కం రూడీ అయ్యింది

హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌కు భారీ ఊర‌ట ల‌భించింది. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన లిక్క‌ర్ స్కాం కేసులో ఎలాంటి అక్ర‌మాలు చోటు చేసుకోలేదంటూ కోర్టు తీర్పు చెప్పింది. ఈ మేర‌కు ఈ కేసులో మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌, త‌దిత‌రుల‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శుక్ర‌వారం క‌విత మీడియాతో మాట్లాడారు. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని అన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు .

తాను ముందు నుంచి కడిగిన ముత్యంలా బయటికి వస్తానని తెలంగాణ ప్రజలకు చెబుతూ వ‌చ్చాన‌ని అన్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పాన‌ని అదే ఇవాళ నిజ‌మైంద‌ని పేర్కొన్నారు. అదే నిజమైంది. దీంతో నేను, నా కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించాం అని వాపోయారు. విపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను -వాడుకుంటున్నారని ఆరోపించారు కేంద్ర స‌ర్కార్ పై. కోర్టు తీర్పు రాకుండానే నాపై కొందరు అనుచితంగా మాట్లాడారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తానని స్ప‌ష్టం చేశారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

  • Related Posts

    మనమిత్రను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతాం

    Spread the love

    Spread the loveరాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ అమరావతి : ప్రస్తుతం రాష్ట్రంలో మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నామ‌ని అన్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా 1.48కోట్ల సేవలు అందించడం…

    ఏపీలోని రిజ‌ర్వాయ‌ర్లన్నీ క‌ళ‌క‌ళ‌

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని అన్ని చిన్న పెద్ద రిజర్వాయర్లలో 1312 టీఎంసీల మేర నిల్వ చేసుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం 793 టీఎంసీల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *