ప్రభుత్వ టీచర్ల జీతాలు త‌గ్గించాలి : ఆకునూరి ముర‌ళి

Spread the love

తెలంగాణ స‌ర్కార్ కు పూర్తి నివేదిక అంద‌జేత

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప‌ని చేస్తున్న ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు రాష్ట్ర విద్యా క‌మిష‌న్ చైర్మ‌న్ , సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ ఆకునూరి ముర‌ళి. త‌న సార‌థ్యంలో ఏర్పాటైన క‌మిటీ గ‌త కొంత కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించింది. ఈ సంద‌ర్బంగా విద్యారంగంలో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు, వ‌స‌తుల క‌ల్ప‌న గురించి పూర్తి నివేదిక‌ను సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కె. కేశ‌వ‌రావుకు అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు నివేదిక‌లో. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ప‌ని చేస్తున్న టీచ‌ర్ల‌కు భారీ ఎత్తున జీతాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు. వీరికి అంద‌జేస్తున్న వేత‌నాలు రాష్ట్ర ఖ‌జానాకు భారంగా మారుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీని వ‌ల్ల మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ఇబ్బంది ఏర్ప‌డుతుంద‌న్నారు.

అందుకే ప్ర‌భుత్వం వెంట‌నే ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌కు సంబంధించిన వేత‌నాల‌ను తగ్గించాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. జీతాల‌తో పాటు అల‌వెన్సులు కూడా త‌గ్గించాల‌న్నారు. ప్రభుత్వ టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది జీతాలు మార్కెట్ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని, వాటిని సమీక్షించి క్రమబద్దీకరించాలని రేవంత్ రెడ్డికి అంద‌జేసిన నివేదిక‌లో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి స్ప‌ష్టం చేశారు. దీంతో విద్యారంగం బలోపేతం చేయడం కష్టంగా మారుతుందన్నారు. టీచర్ల జీతాలు తగ్గించడం ద్వారా మిగిలిన నిధులతో స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని నివేదికలో పేర్కొన్నారు. ఇదే క్ర‌మంలో ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా తీసి వేయాల‌ని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    లిక్కర్ స్కాం కేసులో క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు క్లీన్ చిట్

    Spread the love

    Spread the loveన్యాయ వ్య‌వ‌స్థ‌పై ఉన్న న‌మ్మ‌కం రూడీ అయ్యింది హైద‌రాబాద్ : మాజీ ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత‌కు భారీ ఊర‌ట ల‌భించింది. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించిన లిక్క‌ర్ స్కాం కేసులో ఎలాంటి అక్ర‌మాలు చోటు చేసుకోలేదంటూ కోర్టు తీర్పు చెప్పింది.…

    మనమిత్రను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతాం

    Spread the love

    Spread the loveరాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ అమరావతి : ప్రస్తుతం రాష్ట్రంలో మనమిత్ర ద్వారా 943 సేవలు అందిస్తున్నామ‌ని అన్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటి వరకు ఈ యాప్ ద్వారా 1.48కోట్ల సేవలు అందించడం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *