పేలుడు ఘ‌ట‌న‌పై కార్మిక శాఖ మంత్రి దిగ్భ్రాంతి

Spread the love

ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన వాసంశెట్టి సుభాష్
అమ‌రావ‌తి : కాకినాడ జిల్లా వేట్లపాలెం సమీపంలోని బాణసంచా కర్మాగారంలో శ‌నివారం జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు
గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని, అగ్నిమాపక సిబ్బంది , రెస్క్యూ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. మంటల్లో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి వాసం శెట్టి సుభాష్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు .|ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని, అవసరమైన సహాయాన్ని వెంటనే అందిస్తామని కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్‌ హామీ ఇచ్చారు.

  • Related Posts

    మంత్రి నారా లోకేష్ 82వ రోజు ప్రజాదర్బార్

    Spread the love

    Spread the loveప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరణ విశాఖపట్నం: అనకాపల్లి జిల్లాలో బ్లూ జెట్ పరిశ్రమ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ‌ విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 82వ…

    ఏపీలో 1,404 మ‌ట్టి ప‌రీక్ష కేంద్రాల ఏర్పాటు

    Spread the love

    Spread the loveవెల్ల‌డించిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు 310 కోట్ల రూపాయలు పెట్టుబడి రాయితీ చెల్లించామని అన్నారు. ల్యాబ్లు పని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *