టిటిడి ఆధీనంలోకి శ్రీ అభయ అనుగ్రహ ఆల‌యం

Spread the love

ఆల‌య అధికారుల‌కు అంద‌జేసిన రికార్డులు

తిరుపతి : తిరుప‌తి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మజికండ్రిగ గ్రామంలోని శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆల‌య ధ‌ర్మ‌క‌ర్త కే. నరసింగా రావు, గ్రామస్థులు ఆల‌యానికి సంబంధించిన రికార్డుల‌ను టీటీడీ అధికారులకు అందించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆల‌య స‌ముదాయంలో ఈ ఆల‌యాన్ని చేర్చారు.

ఈ సంద‌ర్బంగా టీటీడీ నుంచి అన్ని వ‌స‌తులు, సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌న్నారు టీటీడీ సూప‌రింటెండెంట్ జ్ఞాన ప్ర‌కాశ్. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని కొలుస్తున్నార‌ని, త‌మ కోరిక‌లు తీరిన వెంట‌నే విరాళాలు పెద్ద ఎత్తున ఇస్తున్నార‌ని తెలిపారు. ఆల‌యాల‌ను స్వాధీనం చేసేందుకు వ‌చ్చే వారికి టీటీడీ మ‌ద్ద‌తు ఇస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడికి చెందిన ఉద్యోగులు ముని కుమార్, రాజేష్, మహేష్, రవికుమార్ రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    క‌న‌క‌దుర్గ గుడిలో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు

    Spread the love

    Spread the loveఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన ఆల‌య అర్చ‌కులు విజయవాడ: తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం వేకువజామున విజయవాడకు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న బెజ‌వాడ‌లో కొలువు తీరిన కోరిన కోర్కెలు…

    మార్చి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

    Spread the love

    Spread the loveవివ‌రాలు వెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు వెల్ల‌డించింది. మార్చి 2న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల సమాప్తి. 3న కుమారధార తీర్థ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *