ఆలయ అధికారులకు అందజేసిన రికార్డులు
తిరుపతి : తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మజికండ్రిగ గ్రామంలోని శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త కే. నరసింగా రావు, గ్రామస్థులు ఆలయానికి సంబంధించిన రికార్డులను టీటీడీ అధికారులకు అందించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఈ ఆలయాన్ని చేర్చారు.
ఈ సందర్బంగా టీటీడీ నుంచి అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు టీటీడీ సూపరింటెండెంట్ జ్ఞాన ప్రకాశ్. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కొలుస్తున్నారని, తమ కోరికలు తీరిన వెంటనే విరాళాలు పెద్ద ఎత్తున ఇస్తున్నారని తెలిపారు. ఆలయాలను స్వాధీనం చేసేందుకు వచ్చే వారికి టీటీడీ మద్దతు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడికి చెందిన ఉద్యోగులు ముని కుమార్, రాజేష్, మహేష్, రవికుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






