మావోయిస్టులపై కిష‌న్ రెడ్డి కీల‌క కామెంట్స్

Spread the love

రాజ్యాంగానికి లోబ‌డి ఎవ‌రు చేరినా ఓకే

అమ‌రావ‌తి : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మావోయిస్టుల‌పై. మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న అంశంపై కేంద్ర స్పందించారు. ప్రజా స్వామ్య దేశంలో అంబెడ్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి ఎవరు ఏ పార్టీలో అయిన చేరొచ్చని అన్నారు. అయితే నక్సలైట్లు , మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వచ్చి ఏ రాజకీయ పార్టీలో చేరుతారో అన్నది వాళ్ళ ఇష్టం అని పేర్కొన్నారు.
రాజ్యాంగానికి లోబడి పనిచేస్తే ప్రభుత్వాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్ప‌ష్టం చేశారు. దేశ వ్యాప్తంగా ఆపరేషన్ ఖాగర్ కొనసాగుతుందని ప్ర‌క‌టించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చిందా అని ప్ర‌శ్నించారు.

రేవంత్ రెడ్డి కెసిఆర్ బ్రాండ్ కోసం కెసిఆర్ రేవంత్ రెడ్డి బ్రాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం జరగడం లేదని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ కు కేంద్రం చేసిన పనులపై లెక్కలతో సహా లేఖ రాసినా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌రు కూడా స్పందించ లేద‌న్నారు కిష‌న్ రెడ్డి. తెలంగాణ లో లంకె బిందలు ఉన్నాయనుకుంటే ఖాళీ బిందెలు ఉన్నాయ‌ని బ‌హిరంగంగా చెప్పిన సీఎం వెయ్యి కోట్లు కాంగ్రెస్ అధిష్టానానికి ఎలా ఇవ్వాలి అనుకున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కిష‌న్ రెడ్డి.

  • Related Posts

    16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా నిషేధం

    Spread the love

    Spread the loveకర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు సీఎం సిద్ద‌రామ‌య్య‌. గ‌త కొంత కాలంగా పిల్ల‌ల‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం చూపుతోంది సోష‌ల్…

    స్పీక‌ర్ అయ్య‌న్న‌ను క‌లిసిన ప‌వ‌న్ కళ్యాణ్

    Spread the love

    Spread the loveఅభివృద్ధి నివేదిక అందజేసిన డిప్యూటీ సీఎం అమ‌రావ‌తి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుని శుక్రవారం స్పీకర్ చాంబర్‌లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *