బాధితుల‌కు న్యాయం చేస్తాం :హోం మంత్రి

Spread the love

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్య‌క్రమం

అమరావ‌తి : బాధితులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యంగా అనిత మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ‘గ్రీవెన్స్ సెల్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి ఆమె వినతులను స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి హోంమంత్రి గారు అక్కడికక్కడే స్పందించారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల సమస్యలపై సంబంధిత జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్టాడారు.

ఈ సంద‌ర్బంగ‌గా బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు వంగ‌ల‌పూడి అనిత‌. పోలీస్ యంత్రాంగం ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, బాధితులు మళ్లీ మళ్లీ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు, వేధింపులకు గురైన బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. పలువురు సామాన్యులు తమ భూములను కబ్జా చేశారని, పోలీసుల సహాయం అందడం లేదని మొర పెట్టుకున్నారు. మహిళలపై జరుగుతున్న అక్రమాలు, వేధింపులపై ఫిర్యాదులు రాగా.. మహిళా భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మంత్రి స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : వైఎస్ జ‌గ‌న్

    Spread the love

    Spread the loveపిచ్చి రాత‌లు రాస్తే తీవ్ర ప‌రిణామాలు త‌ప్ప‌వు తాడేప‌ల్లి గూడెం : ఏబీఎన్ , ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌పై నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. మీడియా చేతిలో ఉంది క‌దా అని ఎలా ప‌డితే…

    రైతు సంక్షేమం కూట‌మి ప్ర‌భుత్వ ల‌క్ష్యం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : రైతుల సంక్షేమం కోసం కూట‌మి ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని చెప్పారు వ్యవ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా అచంట నియోజ‌క‌వ‌ర్గంలోని మారుటోరు వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న కేంద్రంలో కిసాన్ మేళా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *