పోల‌వ‌రం ద్వారా ఉత్త‌రాంధ్ర‌కు గోదావ‌రి జలాలు

అమ‌రావ‌తి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర పంట పొలాలకు గోదావరి జలాలు చేరుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టం అని అభివర్ణించారు. వచ్చే నెలలో జరగనున్న ‘జలహారతి’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో, కాలువ ద్వారా నీటిని విడుదల చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. సీఎం ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన‌ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు వంగ‌ల‌పూడి అనిత‌. పాయకరావుపేటలో 35,000 ఎకరాలకు సాగునీరు అందనుండటం రైతులకు ఎంతో ఊరటనిస్తుందని అన్నారు. ఈ జలాలు తాండవ, వరాహ, శారదా నదుల్లోకి ప్రవహించనున్నాయని తెలిపారు.

రైతుల చిరకాల స్వప్నాలను సాకారం చేయనున్న ఈ గోదావరి జలాలకు ఉత్తరాంధ్ర ఘన స్వాగతం పలుకుతోందని అన్నారు వంగ‌ల‌పూడి అనిత . పోలవరం ఎడమ కాలువ ద్వారా పాయకరావుపేట నియోజకవర్గంలోని వేల‌ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. రైతులను భాగస్వాములను చేస్తూ నిర్వహించే ఈ చారిత్రాత్మక ‘జలహారతి’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి విచ్చేస్తున్న నేపథ్యంలో, అన్ని ఏర్పాట్లనూ పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పని చేయడం ద్వారా విజయవంతం చేయాల‌ని కోరారు.

  • Related Posts

    22ఏ సమస్యల పరిష్కారం కోసం 1,162 కాల్స్

    హైద‌రాబాద్ : 22ఏ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఇప్పటి వరకు 1,162 కాల్స్ వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి తెలిపారు. పీటెడ్, ఓవర్‌ల్యాప్ కాల్స్ తొలగించిన తర్వాత 980 ప్రత్యేక ఫిర్యాదులు ఉన్నాయని చెప్పారు.…

    పర్యాటక అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన చర్యలు

    హైద‌రాబాద్ : తెలంగాణ టూరిజం 2047 పాలసీలో భాగంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాల‌ని దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజయ్ జాజు సూచించారు. ప్రతి జిల్లాలో ఉన్న ముఖ్యమైన పర్యాటక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *