ఉదయ్ కృష్ణ రెడ్డి కేసు సోమ‌వారానికి వాయిదా

హైద‌రాబాద్ : ట్రైనీ ఐపీఎస్ ఉద‌య్ కృష్ణా రెడ్డి కేసు ను విచారించిన హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌న కేసుకు సంబంధించి పూర్తి వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. ఇదిలా ఉండ‌గా కేసు ద‌ర్యాప్తులో భాగంగా డీసీపీ లావణ్య సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)ని సందర్శించి దర్యాప్తును ప్రారంభించారు. ఐపీఎస్ ప్రొబేషనర్ ఉదయ్ కృష్ణ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు చేప‌ట్టింది. ఈ కేసు వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. విచారణ సందర్భంగా, పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఉదయ్ కృష్ణ రెడ్డి ఇంకా శిక్షణలో ఉన్నారని పేర్కొంటూ, ఆయనపై తదుపరి చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలని కోర్టును అభ్యర్థించారు.

అయితే హైకోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది. తన పిటిషన్‌లో ఉదయ్ కృష్ణ రెడ్డిపై తప్పుడు ఆరోపణల ఆధారంగా కేసు నమోదు చేశారని పేర్కొంటూ, ఆ కేసును కొట్టివేయాలని ఆయన కోరారు. మొదట అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసును, సీనియర్ పోలీస్ అధికారులు ‘మహిళా భద్రతా విభాగం’ (Women Safety Wing)కు బదిలీ చేశారు. బదిలీ అనంతరం, డీసీపీ లావణ్య వెంట‌నే రంగంలోకి దిగారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)ని సందర్శించి దర్యాప్తును ప్రారంభించారు. ఉదయ్ కృష్ణ రెడ్డిపై ఫిర్యాదు చేసిన మహిళా ఐపీఎస్ శిక్షణ అధికారి (ట్రైనీ ఆఫీసర్) వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఆమె అకాడమీకి వెళ్లారు.

  • Related Posts

    ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువ : స‌విత

    శ్రీ స‌త్య‌సాయి జిల్లా : దివంగ‌త సీఎం , అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా గురుకుల విద్య నాంది పలికారని చెప్పారు మంత్రి స‌విత . ఆయన స్పూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల…

    24న రాష్ట్ర వ్యాప్తంగా త‌ల్లికి వంద‌నం : నారా లోకేష్

    అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం సంక్షేమం, అభివృద్ది ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంద‌ని చెప్పారు. ఇవాళ లోకేష్ మీడియాతో మాట్లాడారు. సుస్థిర‌మైన డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ ఇక్క‌డ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *