ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి అప్సరా రెడ్డి రాజీనామా

చెన్నై : అన్నాడీఎంకే పార్టీ కి బిగ్ షాక్ త‌గిలింది. ఆ పార్టీ అధికార ప్ర‌తినిధి ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు అప్స‌రా రెడ్డి. ఈ సంద‌ర్బంగా త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ చీఫ్ కు పంపించారు. ఆ లేఖ‌లో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ నిర్ణయం మనస్పర్థలతోనో, అగౌరవంతోనో తీసుకున్నది కాదని పేర్కొన్నారు. నా నమ్మకాలకు, నా ప్రజా జీవితానికి మార్గదర్శకమైన సూత్రాలకు కట్టుబడి ఉండటానికి ఇది భావోద్వేగంతో, ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని స్ప‌ష్టం చేశారు అప్ప‌రా రెడ్డి. నా జీవితంలోని ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని తీర్చిదిద్దిన అవకాశాలు, బాధ్యతలు, స్నేహాలు, అనుభవాలకు కృతజ్ఞతతో నేను పార్టీని వీడుతున్నాను. ఏఐఏడీఎంకేతో నా అనుబంధాన్ని, నాతో పాటు సేవ చేసే భాగ్యం పొందిన ప్రజలను నేను ఎప్పటికీ గుర్తుంచు కుంటాను అని తెలిపారు

నా రాజకీయ ప్రయాణం ఇప్పుడు వేరే మలుపు తీసుకోవచ్చు, కానీ ప్రజలకు సేవ చేయాలనే నా నిబద్ధత మారదని కుండ బద్ద‌లు కొట్టారు అప్ప‌రా రాణి. ప్రజలతో నిలబడటానికి, వినాల్సిన గొంతులను వినిపించడానికి, వారధులు నిర్మించడానికి, ధైర్యంతో, కరుణతో, గౌరవంతో సేవ చేయడానికి నేను అమ్మ అడుగు జాడలను అనుసరిస్తూనే ఉంటానని పేర్కొన్నారు .ఈ రాజకీయ నిర్ణయం తర్వాత కూడా మన మధ్య ఉన్న వ్యక్తిగత ఆత్మీయత, గౌరవం కొనసాగుతాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని తెలిపారు.

  • Related Posts

    కొత్త దరఖాస్తుదారులకు 20లోగా ఆర్థిక సాయం

    అమరావతి : నేతన్నల సేవలో పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. సాంకేతిక కారణాల రీత్యా కొందరికి ఇంకా నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం…

    హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ మార్చ్

    హైద‌రాబాద్ : హల్ద్వానీ ఘటనకు నిరసనగా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకి సంఘీభావంగా జిల్లా స్థాయిలో మార్చ్, సత్యాగ్రహం నిర్వ‌హించాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ గారు జారీ చేసిన లేఖ ప్రకారం, హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *