అర్జున పుర‌స్కార గ్ర‌హీత‌ల‌కు సీఎం కంగ్రాట్స్

హైద‌రాబాద్ : కేంద్ర స‌ర్కార్ తాజాగా అర్జున పుర‌స్కారాల‌ను ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎంపిక‌య్యారు షట్లర్ గాయత్రి గోపీచంద్ , షూటర్ ధనుష్ శ్రీకాంత్‌. ఈ సంద‌ర్బ‌గా సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పందించారు. అవార్డులు పొందిన వీరికి ముఖ్యమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో అసాధారణ ప్రతిభను కనబరిచి అర్జున అవార్డులకు ఎంపికైన గాయత్రి గోపీచంద్, ధనుష్ శ్రీకాంత్ లు తెలంగాణకు, దేశానికి గర్వకారణమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

అదేవిధంగా, ‘నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్-2025’ విజేతలందరికీ ముఖ్యమంత్రి తన శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడారంగంలో వారు ప్రదర్శించిన అంకితభావం, పట్టుదల , కృషి యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించి, ప్రతిష్టాత్మక అవార్డులను అందుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడాభివృద్ది కోసం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంద‌న్నారు. త్వ‌ర‌లోనే ఖేలో ఇండియా పోటీలు హైద‌రాబాద్ లో నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ఈసారి బ‌డ్జెట్ లో అత్య‌ధికంగా క్రీడా రంగానికి నిధులు కేటాయించామ‌న్నారు సీఎం.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *