బెంగళూరు : భారీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మంత్రి బి. నాగేంద్రను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ దాని మిత్రపక్షమైన జనతా దళ్ (సెక్యులర్ – జేడీఎస్) బెంగళూరులో నిరసన చేపట్టాయి. బెంగళూరులోని విధాన సౌధ వద్ద, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగేంద్రను వెంటనే తప్పించాలని కోరాయి. నిరసనలో కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు , ఎమ్మెల్యే బి.వై. విజయేంద్ర తదితరులు నినాదాలు చేశారు . మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్లో జరిగిన భారీ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న నాగేంద్రకు కేబినెట్ లో చోటు ఎలా కల్పిస్తారంటూ ప్రశ్నించారు. బెంగళూరులోని విధాన సౌధలో ఉన్న వాల్మీకి విగ్రహం ముందు నిరసన తెలిపాయి. బళ్లారి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నాగేంద్ర ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడు బి.కె. హరిప్రసాద్ నాకు సూచనలు ఇచ్చారు, కాబట్టి నేను ఇప్పుడు ఏమీ వ్యాఖ్యానించను. అన్ని విషయాలు కోర్టు పరిధిలో ఉన్నందున నేను స్పందించను” అని అన్నారు. అయితే, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కార్పొరేషన్లో జరిగినట్లు ఆరోపించ బడుతున్న ఆర్థిక అవకతవకలపై అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కోవడానికి నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు సిద్ధంగా లేరని నాగేంద్ర పేర్కొన్నారు; వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, వారు మాత్రం సిద్ధంగా లేరని ఆయన అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సమయాన్ని (ఉద్దేశ పూర్వకంగా) వృథా చేస్తున్నారని ఆయన బీజేపీ నాయకులపై ఆరోపణలు చేశారు.
“వాల్మీకి కార్పొరేషన్లో సుమారు రూ. 187 కోట్ల ఆర్థిక అవకతవకలకు సంబంధించిన సరైన ఆధారాలు ఉన్నప్పటికీ, ఆ కుంభకోణంలో మంత్రి ప్రమేయంపై తాము పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా సీబీఐ, ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో నాగేంద్ర ప్రధాన నిందితుడిగా ఉన్నారని, ఈ క్రమంలో తనకు ఎలా మంత్రి పదవి ఇస్తారమంటూ మరోసారి నిలదీశారు.





